ఒత్తిడి నుంచి తప్పించుకోవాలంటే అదొక్కటే మార్గం సుమా.!
- May 13, 2023
ఒత్తిడి, స్ర్టెస్.. ఇలా పేరేదైనా ఇది మానవ జీవితంలో ఒకప్పటితో పోల్చితే చాలా చాలా ఎక్కువైపోయింది. స్పీడుగా ఎదిగిన, ఎదుగుతోన్న సొసైటీనీ, టెక్నాలజీని అందుకోవడానికి యువత కాదు, కాదు, యావత్ ప్రపంచం పడుతోన్న తంటా అంతా ఇంతా కాదు.
ఆ క్రమంలోనే తీవ్రమైన ఒత్తిడిని ఫేస్ చేస్తున్నారు. తద్వారా అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయ్. ఎక్కువ సమయం విశ్రాంతి లేకుండా పని చేసేవారికి ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువవుతోంది.
ఒత్తిడిని తట్టుకోలేక కొన్ని పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిని కూడా తెచ్చుకోవల్సి వస్తోంది. ఒత్తిడిని తట్టుకోవడానికి ఒకే ఒక మార్గం వ్యాయాయం.
అది వాకింగ్, జాగింగ్, యోగా ఏ మార్గంలోనైనా అవలంభించవచ్చు. మంచి ఫలితం వుంటుంది. కనీసం రోజులో అరగంటైనా ఇందుకోసం టైమ్ కేటాయించాలి.
ఒత్తిడికి గురైనప్పుడు మన కండరాల్లో టెన్షన్ మొదలవుతుంది. దాంతో పటుత్వంలో తేడా వస్తుంది. ఆ సమయంలో వేడి నీటితో స్నానం చేస్తే మంచి పలితం వుంటుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడిని తట్టుకోవాలంటే మరో ముఖ్యమైన అంశం నిద్ర. చేసే పనిని బట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా వుండాల్సిందే.
సౌష్టికాహారం తీసుకుంటూ చేసే పనులను టైమ్ ప్రకారం విభజించుకుంటూ సిస్టమేటిక్గా పూర్తి చేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
తాజా వార్తలు
- సమ్మర్ రద్దీ నిర్వాహణకు దుబాయ్ విమానాశ్రయం సన్నద్ధం..!!
- ఎడ్యుకేషన్ సిటీలో ఆకట్టుకుంటున్న సమ్మర్ ఆఫ్ డిస్కవరీ..!!
- OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!
- ప్రిన్స్ తుర్కీ బిన్ మహమ్మద్ తో కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- కువైట్ ఎంబసీలో అత్యవసర కేసులకే వీసా సేవలు..!!
- ఖరీఫ్ 2026.. ధోఫార్కు తొలి సహాయక దళం: సీడీఏఏ
- ఏపీ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..







