బహ్రెయిన్ జనాభాలో 'తీవ్ర అసమతుల్యత'
- May 16, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ ప్రస్తుతం లింగ నిష్పత్తిలో తీవ్రమైన అసమతుల్యతను ఎదుర్కొంటుంది. తాజా డేటా ప్రకారం.. 2022, 2023 మధ్య రాజ్య జనాభా 13,000 పెరిగినప్పటికీ.. మొత్తం జనాభాలో 38.1 శాతం స్త్రీలు, 61.9 శాతం పురుషులు నిష్పత్తి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా లింగ నిష్పత్తి తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. ఖతార్, యూఏఈ, బహ్రెయిన్లలో స్త్రీ-పురుష నిష్పత్తులు ఎక్కువగా ఉన్న దేశాలు అని తాజా డేటా చెబుతోంది.
గల్ఫ్ దేశాలు ఇంత అసమాన జనాభా ఉండేందుకు ప్రధానంగా పురుష తాత్కాలిక కార్మికుల పెద్ద వలస జనాభా అధికంగా ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు. బహ్రెయిన్ జనాభాలో దాదాపు సగం మంది వలస కార్మికులు ఉండటం వారి వాదనను బలపరుస్తుంది.
ప్యూ రీసెర్చ్ ప్రకారం.. అసమతుల్య లింగ నిష్పత్తికి దోహదం చేసే దేశాలలో సెక్స్-సెలెక్టివ్ అబార్షన్లు, ఆడ శిశుహత్యలు ఎక్కువగా కనిపిస్తుంది. అధ్యయనాలు అసమతుల్య జనాభా ప్రమాదకరమైనదిగా పేర్కొన్నాయి. చాలా సమాజాలలో భాగస్వామి దొరకక పిల్లల జనాభా పెరగడం లేదు. ఇంది పురుషులు, స్త్రీలకు బలమైన సామాజిక నిబంధనలు, ఒత్తిళ్లు తీసుకువస్తున్నాయి. పైగా ఈ సమస్య.. ఆయా వర్గాల దీర్ఘకాలిక ఆర్థిక అవకాశాలపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







