'రాయుడు' చిత్రం ఆడియోను ఇవాళ విడుదల ...
- May 11, 2016
విశాల్, శ్రీదివ్య జంటగా నటించిన 'రాయుడు' చిత్రం ఆడియోను ఇవాళ హైదరాబాద్లో విడుదల చేయనున్నారు. హీరో విశాల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా'రాయుడు' సరికొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. చిత్ర ట్రైలర్ను కూడా త్వరలో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మే 20న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై విశాల్ సమర్పిస్తున్నారు. ఇమాన్ చిత్రానికి సంగీతం సమకూర్చారు. విశాల్ ఈ చిత్రంలో విభిన్న పాత్రతో అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక మాస్ ఎంటర్టైనర్. ప్రస్తుతం విశాల్ పందెంకోడికి సీక్వెల్గా తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







