ఓటీటీలో ‘విరూపాక్ష’.! ఇది నెక్స్ట్ లెవల్ క్రేజ్ బాస్.!
- May 18, 2023
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘విరూపాక్ష’ సినిమా ఏ స్థాయిలో సూపర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సూపర్ సక్సెస్తో పాటూ, బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ కొల్లగొట్టినట్లు అధికారికంగా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయ్. కాగా, ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది.
ఈ ఆదివారం నుంచి ప్రముఖ ఓటీటీ ఛానెల్లో ‘విరూపాక్ష’ స్ర్టీమింగ్కి సిద్ధంగా వుంది. ఇప్పటికే ఈ తరం, ఆ తరం అనే తేడా లేకుండా ఈ సినిమాని ధియేటర్లలో పిచ్చ పిచ్చగా చూసేశారు ఆడియన్స్.
మళ్లీ ఓటీటీలో చూసేందుకు అదే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత తేజుకి ‘విరూపాక్ష’ బెస్ట్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు.
కొత్త దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాని తెరకెక్కించాడు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







