ఓటీటీలో ‘విరూపాక్ష’.! ఇది నెక్స్ట్ లెవల్ క్రేజ్ బాస్.!
- May 18, 2023సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘విరూపాక్ష’ సినిమా ఏ స్థాయిలో సూపర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
సూపర్ సక్సెస్తో పాటూ, బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల మార్క్ కొల్లగొట్టినట్లు అధికారికంగా ట్రేడ్ వర్గాలు ప్రకటించాయ్. కాగా, ఈ సినిమాని ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సర్వం సిద్ధమైంది.
ఈ ఆదివారం నుంచి ప్రముఖ ఓటీటీ ఛానెల్లో ‘విరూపాక్ష’ స్ర్టీమింగ్కి సిద్ధంగా వుంది. ఇప్పటికే ఈ తరం, ఆ తరం అనే తేడా లేకుండా ఈ సినిమాని ధియేటర్లలో పిచ్చ పిచ్చగా చూసేశారు ఆడియన్స్.
మళ్లీ ఓటీటీలో చూసేందుకు అదే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. యాక్సిడెంట్ తర్వాత తేజుకి ‘విరూపాక్ష’ బెస్ట్ కమ్ బ్యాక్ అని చెప్పొచ్చు.
కొత్త దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాని తెరకెక్కించాడు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..