హజ్ యాత్రికులకు బాసటగా నిలిచిన సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపిన కువైట్ ప్రవాసాంధ్రులు
- May 19, 2023
కువైట్ సిటీ: హజ్ యాత్రికుల కు బాసటగా నిలిచిన ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కువైట్ లోని ప్రవాసాంధ్ర మైనారిటీల నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. కువైట్ లోని హవల్లీ ప్రాంతంలో గల ఆర్.ఆర్ రెస్టారెంట్ లో ఏర్పాటు చేసిన సమావేశములో వైఎస్ఆర్సిపీ గల్ఫ్ మరియు కువైట్ కన్వీనర్లు ఇలియాస్ బి.హెచ్. ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ ముస్లిం మైనారిటీ సోదరులకు బాసటగా నిలిచి 1 .813 హజ్ యాత్రికులకు ప్రతి ఒక్కరికి 83 వేలు మొత్తం 14 .51 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విడుదల చేయడం హర్షణీయమని తెలుపుతూ హజ్ యాత్రికుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసికెళ్ళి సమస్యను పరిష్కరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎస్.బి.అంజాద్ బాషాకి ధన్యవాదాలు తెలిపారు.
వైయస్ఆర్ సిపి కువైట్ కమిటీ మైనార్టీ నాయకులు లక్కీ అజిస్ మాట్లాడుతూ, భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదని మైనారిటీ ముస్లిం సోదరులు అందరూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.
ఈ కార్యక్రమములో ప్రముఖ ప్రారిశ్రామక వేత్త కరీం చెప్పలి, హబీబ్ చెప్పలి, షేక్ రహమతుల్లా, షా హుస్సేన్, షేక్ జాఫర్, అబూ తురబ్, సజ్జాద్, ఇమ్రాన్, అబ్దుల్ అజిస్ మరియు వైయస్ఆర్ సిపి కువైట్ నాయకులు గోవిందు నాగరాజు, యం .వి. నరసారెడ్డి, నాయని మహేశ్వర్ రెడ్డి, మన్నూర్ చంద్ర శేఖర్ రెడ్డి, రమణ యాదవ్, మర్రి కళ్యాణ్, నాగిరెడ్డి చంద్రారెడ్డి, పులపుత్తూర్ సురేష్ రెడ్డి,బి.యన్.సింహ, ఆడపూర్ ప్రసాద్ , గజ్జల నరసారెడ్డి , అరవ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ఒమన్ అక్రాస్ ఏజెస్ మ్యూజియంలో అరుదైన ఘనత..!!
- వరద ముంచుకొస్తున్న వేళ..1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన నేపాల్ పాఠశాల ప్రిన్సిపాల్
- దోహాలో ICBF ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
- నేపాల్-టిబెట్ వరదల్లో 750కు చేరిన మృతుల సంఖ్య.. 3,044 మంది గల్లంతు







