ఈ సారి మాత్రం ప్యాన్ ఇండియా టార్గెట్ పక్కా.!
- May 19, 2023‘కార్తికేయ 2’ సినిమాతో అనూహ్యంగా నార్త్ ఆడియన్స్ని ఎట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్ద్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాకి నార్త్ జనం పట్టం కట్టారు.
అలా నార్త్ ఆడియన్స్లో నిఖిల్ బాగా రిజిస్టర్ అయిపోయాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘18 పేజెస్’ సినిమాకి ఈ ఇమేజ్ని వాడుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు నిఖిల్.
కానీ, ఇప్పుడు నిఖిల్ తాజా సినిమా ‘స్సై’ మాత్రం ప్యాన్ ఇండియాని టార్గెట్ చేస్తోంది. యూనివర్సల్ కంటెంట్ కావడంతో, నార్త్ పైనా ఈ సినిమాకి ఫోకస్ వుందట.
ఆ దిశగానే ప్రమోషన్లు షురూ చేశారు నిఖిల్ అండ్ టీమ్. నేతాజీ సుభాస్ చంద్రబోస్ మరణానికి సంబంధించిన సీక్రెట్స్ ఈ సినిమాలో చూపించబోతున్నారట. పూర్తిగా ఫిక్షనల్ కాకుండా, కొంత మేర యదార్ధ ఘటనలను ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారట.
అవసరమైన కొన్ని సీన్ల కోసం ఫిక్షన్ వాడినట్లు నిఖిల్ ప్రమోషన్లలో వివరణ ఇచ్చాడు. గ్యారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటించింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..