బాగ్దాద్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు
- May 11, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నగర సమీపంలో షియాలు ఎక్కువగా ఉండే సదార్ సిటీలో బిజీ మార్కెట్లో కారుబాంబు పేలింది. దీంతో 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు భద్రత సిబ్బంది, ఇతర అధికారులు వెల్లడించారు. మరో 60 మంది వరకూ గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో నింపిన ఎస్యూవీని మార్కెట్లో ఉంచి పేల్చారు. బాధితుల్లో చాలా మంది మహిళలు ఉన్నట్లు సమచారం. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ఘటన పట్ల ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. బాగ్దాద్ పరిసర ప్రాంతాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తరచూ దాడులకు తెగబడుతూనే ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు







