బాగ్దాద్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు

- May 11, 2016 , by Maagulf
బాగ్దాద్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నగర సమీపంలో షియాలు ఎక్కువగా ఉండే సదార్‌ సిటీలో బిజీ మార్కెట్‌లో కారుబాంబు పేలింది. దీంతో 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు భద్రత సిబ్బంది, ఇతర అధికారులు వెల్లడించారు. మరో 60 మంది వరకూ గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.భారీ ఎత్తున పేలుడు పదార్థాలతో నింపిన ఎస్‌యూవీని మార్కెట్‌లో ఉంచి పేల్చారు. బాధితుల్లో చాలా మంది మహిళలు ఉన్నట్లు సమచారం. క్షతగాత్రుల్లో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశముంది. ఈ ఘటన పట్ల ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేసింది. బాగ్దాద్‌ పరిసర ప్రాంతాల్లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు తరచూ దాడులకు తెగబడుతూనే ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com