బందరు పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం జగన్
- May 22, 2023
మచిలీపట్నం: మచిలీపట్నంలో బందరు పోర్టు పనులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించి శాస్త్రోక్తంగా బందరు పోర్టు నిర్మాణ పనులను సీఎం మొదలుపెట్టారు. ముందుగా తపసిపూడిలో సముద్రుడికి హారతి ఇచ్చి, గంగమ్మకు పూజ చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. గంగమ్మతల్లికి చీర, సారెతో పాటు పసుపు కుంకుమను సమర్పించారు. బ్రేక్ వాటర్ పనుల్లో భాగంగా 99 లారీల్లో తీసుకొచ్చిన కొండ రాళ్ళతో డంపింగ్ చేశారు. దీంతో తపసిపూడి తీరంలో బ్రేక్ వాటర్ పనులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బందరు పోర్టు పైలాన్ను ఆవిష్కరించారు. శంకుస్థాపన జరిగినే రోజే బందరు పోర్టు పనులు మొదలయ్యాయి. ఆపై జిల్లా పరిషత్ సెంటర్లోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడి నుంచి తాడేపల్లి నివాసానికి సీఎం వెళ్లనున్నారు.

తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









