అంతరిక్ష కేంద్రానికి చేరిన సౌదీ వ్యోమగాములు..!
- May 22, 2023
యూఏఈ: సౌదీ అరేబియాకు మరో ఇద్దరు వ్యోమగాములు ఆదివారం నాడు చార్టర్డ్ మల్టీమిలియన్ డాలర్ల విమానంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా ప్రయోగాన్ని చేపట్టారు. వీరందరు ఒక వారం పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడుపనున్నారు. సౌదీ అరేబియా ప్రభుత్వంచే స్పాన్సర్ చేయబడిన, స్టెమ్ సెల్ పరిశోధకురాలు రయ్యానా బర్నావి అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి సౌదీ మహిళగా రికార్డు నమోదు చేశారు. రాయల్ సౌదీ వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్ అలీ అల్ ఖర్నీ ఆమెతోపా అంతరిక్ష కేంద్రానికి చేరారు.
సౌదీ యువరాజు 1985లో డిస్కవరీ షటిల్లో వెళ్లిన తర్వాత దశాబ్దాల తర్వాత మరోసారి దేశం స్పాన్సర్ తో వీరిద్దరు అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సుల్తాన్ అల్నెయాడి వారిని అంతరిక్ష కేంద్రంలోకి స్వాగతించారు. “బాహ్య అంతరిక్షం నుండి హలో! ఈ క్యాప్సూల్ నుండి భూమిని వీక్షించడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది" అని కక్ష్యలో స్థిరపడిన తర్వాత బర్నావి చెప్పారు. "నేను అంతరిక్షంలోకి వెలుపల చూస్తున్నప్పుడు, ఇది అందరికీ గొప్ప ప్రయాణానికి నాంది అని నేను అనుకోకుండా ఉండలేను.." అని అల్-కర్ని పేర్కొన్నారు. వీరితోపాటు నాక్స్విల్లే, టేనస్సీకి చెందిన స్పోర్ట్స్ కార్ రేసింగ్ టీమ్కు మాజీ డ్రైవర్, యజమాని జాన్ షాఫ్నర్, అంతరిక్షంలో అత్యధిక సమయం గడిపిన (665 రోజులు) చాపెరోన్ పెగ్గీ విట్సన్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







