యూఏఈ లో పెరగనున్న ఉష్ణోగ్రతలు?
- May 23, 2023
యూఏఈ: దేశంలోని కొన్ని ప్రాంతాలలో పగటిపూట మాత్రమే పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) అంచనా వేసింది. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలలో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చునని, ఉష్ణప్రసరణ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని NCM ప్రతినిధి డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. ముఖ్యంగా దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అయితే, ఇవేవి ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పును తీసుకురాలేవన్నారు. బుధవారం, దుబాయ్- అబుధాబితో సహా వివిధ ఎమిరేట్స్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. NCM కొన్ని ప్రాంతాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. మరో వారం పాటు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







