యూఏఈ లో పెరగనున్న ఉష్ణోగ్రతలు?
- May 23, 2023
యూఏఈ: దేశంలోని కొన్ని ప్రాంతాలలో పగటిపూట మాత్రమే పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని యూఏఈ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) అంచనా వేసింది. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలలో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చునని, ఉష్ణప్రసరణ మేఘాలు ఏర్పడే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని NCM ప్రతినిధి డాక్టర్ అహ్మద్ హబీబ్ తెలిపారు. ముఖ్యంగా దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాలలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. అయితే, ఇవేవి ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పును తీసుకురాలేవన్నారు. బుధవారం, దుబాయ్- అబుధాబితో సహా వివిధ ఎమిరేట్స్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. NCM కొన్ని ప్రాంతాలకు ఎల్లో, ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. మరో వారం పాటు 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









