విజయవాడ నుంచి హజ్యాత్రకు ప్రత్యేక విమానాలు- డిప్యూటీ సిఎం అంజాద్బాషా
- May 24, 2023అమరావతి: జూన్ 7 నుంచి 19 వరకు విజయవాడ నుంచి హజ్యాత్రకు వెళ్లేవారి కోసం ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటీ సిఎం అంజాద్ బాషా తెలిపారు. ఈ ఏడాది గన్నవరం ఎయిర్పోర్టులో ఏర్పాటుచేసిన ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 1,813 మంది యాత్రికులను నేరుగా హజ్యాత్రకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా ప్రతిరోజూ 155 మంది హజ్యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. వివిధ ఎయిర్లైన్స్ రాష్ట్రం నుంచి యాత్రికులను హజ్కు తీసుకెళ్లి మరలా తిరిగి హజ్నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. గుంటూరు జిల్లా నంబూరు మదరసాలో వసతి కల్పన, ఎసి బస్సుల ద్వారా గన్నవరం ఎయిర్పోర్టుకు యాత్రికులను చేర్చే సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్
- సభన్లో కార్మికుల కోసం రెసిడెన్షియల్ సిటీ నిర్మాణం
- ఖైదీల విడుదలకు అహద్ ఫౌండేషన్ సాయం
- అరబ్ సమ్మిట్.. సిరియా, ఇరాక్లను ఆహ్వానించిన కింగ్ హమద్
- ఎయిర్ ఇండియా పై రూ.80 లక్షల ఫైన్
- రూ.56,999కే Apple iPhone 14