విజయవాడ నుంచి హజ్యాత్రకు ప్రత్యేక విమానాలు- డిప్యూటీ సిఎం అంజాద్బాషా
- May 24, 2023
అమరావతి: జూన్ 7 నుంచి 19 వరకు విజయవాడ నుంచి హజ్యాత్రకు వెళ్లేవారి కోసం ఏర్పాట్లు చేసినట్లు డిప్యూటీ సిఎం అంజాద్ బాషా తెలిపారు. ఈ ఏడాది గన్నవరం ఎయిర్పోర్టులో ఏర్పాటుచేసిన ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 1,813 మంది యాత్రికులను నేరుగా హజ్యాత్రకు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా ప్రతిరోజూ 155 మంది హజ్యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు. వివిధ ఎయిర్లైన్స్ రాష్ట్రం నుంచి యాత్రికులను హజ్కు తీసుకెళ్లి మరలా తిరిగి హజ్నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు. గుంటూరు జిల్లా నంబూరు మదరసాలో వసతి కల్పన, ఎసి బస్సుల ద్వారా గన్నవరం ఎయిర్పోర్టుకు యాత్రికులను చేర్చే సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







