వాతావరణ మార్పులతో పెరుగుతున్న అలెర్జీ కేసులు..!
- May 25, 2023
యూఏఈ: యూఏఈ నివాసితులలో వాతావరణ మార్పులతో అలెర్జీ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు UAEలోని వైద్య నిపుణులు తెలిపారు. గత వారంలో వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా దేశంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, క్లినిక్లలో రోగుల సంఖ్య పెరిగిందన్నారు. గొంతు నొప్పి, ఉబ్బిన కళ్ళు వంటి లక్షణాలు సాధారణ అలెర్జీలని, వీటిని గమనించగానే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు. కాలానుగుణ మార్పులు దుమ్ము తదితర సమస్యలతో శ్వాసకోశ సమస్యలు సృష్టిస్తాయని తుంబే యూనివర్శిటీ హాస్పిటల్లోని పల్మోనాలజిస్ట్ డాక్టర్ మొహమ్మద్ సైఫెల్డిన్ అబ్దేల్రాహ్మాన్ మొహమ్మద్ చెప్పారు. “సాధారణ జలుబు లేదా ఫ్లూ వంటి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్లు ఉష్ణోగ్రత మరియు తేమలో హెచ్చుతగ్గులతో తరచుగా వస్తాయి. ఈ వైరస్లు వ్యాప్తి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో రోగులు శ్వాసకోశ లక్షణాలు లేదా ఫ్లూతో బాధపడుతున్నారు.’’ అని పేర్కొన్నారు. “కళ్లు ఎర్రబడడం, చర్మంపై దద్దుర్లు, ముక్కు కారడం, ఆస్తమా రూపంలో పిల్లలలో అలెర్జీ వ్యాధులకు సంబంధించిన కేసులు గత కొన్ని వారాలుగా పెరిగాయి.”అని అల్ ఐన్లోని బుర్జీల్ ఫర్హా హాస్పిటల్లోని కన్సల్టెంట్ పీడియాట్రిక్స్ డాక్టర్ మోస్తఫా మాగేద్ హాటెమ్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స







