ఇండియన్ సైన్స్ ఫోరమ్లో విద్యార్థుల అద్భుత ప్రతిభ
- May 25, 2023
మస్కట్: ఇండియన్ సైన్స్ ఫోరమ్ వార్షిక సైన్స్ ఫియస్టా 2023లో ఒమన్లోని వివిధ ప్రాంతాలలో ఉన్న భారతీయ పాఠశాలల నుండి వందలాది మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటారు. రోలింగ్ ట్రోఫీని ఇండియన్ స్కూల్ అల్ గుబ్రా గెలుచుకుంది. ఇండియన్ సోషల్ క్లబ్ ఆధ్వర్యంలో ‘‘ఇండియాస్ స్పేస్ జర్నీ: మూన్, మార్స్ అండ్ బియాండ్’’ అనే థీమ్ తో ఈ సంవత్సరం కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రోజు.. జూనియర్లు, సీనియర్లకు డిబేట్లు, స్పాట్ ప్రాజెక్ట్లు, ఫోటోగ్రఫీ పోటీలు, డిజిటల్ సింపోజియం, సైన్స్ ఎగ్జిబిషన్ వంటి వివిధ పోటీలను నిర్వహించారు.
ఒమన్లోని ఇండియన్ సోషల్ క్లబ్లోని ఇండియన్ సైన్స్ ఫోరమ్ కోఆర్డినేటర్ డాక్టర్ జె.రెత్నకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రదర్శన అంచనాలకు మించి ఉందన్నారు. ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్ ఇండియన్ సైన్స్ ఫోరమ్ రెండు రోజుల వార్షిక సైన్స్ ఫియస్టా ఒమన్లోని అద్భుతమైన విద్యార్థుల ప్రతిభను తెలియజేసిందన్నారు. అంతకుముందు ఒమన్ సుల్తానేట్లోని భారత రాయబారి అమిత్ నారంగ్ మాట్లాడారు. నేషనల్ యూనివర్శిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఇన్నోవేషన్ సెంటర్లో జరిగిన విద్యార్థుల వైజ్ఞానిక ప్రదర్శన గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు.
ఇండియన్ సైన్స్ ఫోరమ్ తరపున, ఐఎస్ఎఫ్ ఎపిజె అబ్దుల్ కలాం అవార్డును ఇస్రో మాజీ డైరెక్టర్ పద్మశ్రీ డాక్టర్ మైల్స్వామి అన్నాదురైకి కోఆర్డినేటర్ డాక్టర్ జె.రెత్నకుమార్ అందజేశారు. చంద్రయాన్-1, మంగళయాన్ వంటి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రాజెక్టులలో అతను పనిచేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ మైల్ స్వామి అన్నాదురై మాట్లాడుతూ.. భవిష్యత్తులో విద్యార్థులు అనేక ఘనతలు సాధించాలని ఆకాంక్షించారు. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అలీ అల్ బిమానీ మాట్లాడుతూ.. “ఏ దేశమైనా పురోగతి, అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ కీలకం. విజయవంతమైన ఆర్థిక వ్యవస్థకు సైన్స్, టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ అనేది కీలకం.’’ అని పేర్కొన్నారు.
ఎడ్యుటెక్ వ్యవస్థాపకురాలు, సీఈఓ సుధా విశ్వనాథన్ ను ఇండియన్ సైన్స్ ఫోరమ్ తరపున డాక్టర్ జె రెత్నకుమార్ సత్కరించారు. ఆమె ప్రస్తుతం బిట్స్ పిలానీ, దుబాయ్ కోసం డాక్టర్ అన్నాదురైతో కలిసి మహాశాట్ అనే ప్రతిష్టాత్మక స్టూడెంట్స్ శాటిలైట్ ప్రాజెక్ట్లో పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







