ఎన్టీఆర్ నేషనల్ లెజెండరీ అవార్డుల లోగోను ఆవిష్కరించిన మంత్రి తలసాని శ్రీనివాస్
- May 26, 2023హైదరాబాద్: దివంగత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలుగు సినిమా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఎన్టీఆర్ లెజెండరీ నేషనల్ అవార్డుల లోగోను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆవిష్కరించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి “మనం సైతం” స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు, ప్రముఖ సీనియర్ నటుడు కాదంబరి కిరణ్ అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎఫ్టీపీసీ అధ్యక్షుడు చైతన్య జంగా, తెలుగు సినిమా వేదిక అధ్యక్షుడు వీఎస్ వర్మ పాకలపాటి, అవార్డుల కమిటీ సభ్యులు విశ్వనాథ్, రాంచంద్, నాగార్జునరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో గ్లోబల్ మోడల్ అవార్డు విజేత ఐశ్వర్యరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ శత జయంతి ముగింపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.ఎఫ్టీపీసీ అధ్యక్షుడు చైతన్య జంగా మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కీర్తిని చిరస్థాయిగా నిలబెట్టడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని, మే 28న హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్ ఆడిటోరియంలో ప్రధానోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.ఎనిమిది రాష్ట్రాల ప్రతినిధులను పాల్గొని ఈ ఫిల్మ్ సొసైటీ అవార్డు వేడుకను నిర్వహించనున్నట్టు తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకుడు వీఎస్ వర్మ పాకలపాటి తెలిపారు.మిస్ గ్లోబల్ వరల్డ్ అవార్డ్ విన్నర్ ఐశ్వర్యరాజు ఇలాంటి గ్రాండ్ సెలబ్రేషన్స్లో పాల్గొనడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు