ఐపీఎల్ 2023: ముంబై పై గుజరాత్ విజయం..
- May 27, 2023
గుజరాత్: కీలక పోరులో గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 2లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా హార్దిక్ సేన వరుసగా రెండో ఏడాది కూడా ఐపీఎల్ ఫైనల్స్కు దూసుకువెళ్లింది. ఆదివారం(మే 28న) చెన్నై సూపర్ కింగ్స్తో టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనుంది.
234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌలైంది. ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(61; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకంతో దంచికొట్టగా తిలక్ వర్మ(43; 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. మిగిలిన వారిలో కామెరూన్ గ్రీన్(30) పర్వాలేదనిపించగా, రోహిత్ శర్మ(8), నెహల్ వధేరా(4), టిమ్ డేవిడ్(2), విష్ణు వినోద్(2) విఫలం అయ్యారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ ఐదు వికెట్లు తీయగా రషీద్ ఖాన్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు, జాషువా లిటిల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 233 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో ఓపెనర్ శుభ్మన్ గిల్ (129; 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్లు) శతకంతో దంచికొట్టాడు. ఈ సీజన్లో గిల్కు ఇది మూడో శతకం కాగా.. చివరిగా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడో సెంచరీ కావడం గమనార్హం. మిగిలిన వారిలో సాయి సుదర్శన్ (43), హార్దిక్ పాండ్య (28*) దూకుడుగా ఆడారు. ముంబయి బౌలర్లు ఆకాశ్ మధ్వాల్, పీయూశ్ చావ్లా చెరో వికెట్ తీశారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ ఫోర్జరీ.. వ్యక్తికి జైలు శిక్ష
- గ్రాండ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వేడుక: విజేతలకు బహుమతుల అందజేత
- సౌదీలో గణనీయంగా పెరిగిన బీమాదారులు
- ఏడాదిలో 7,000 మంది ప్రవాసులు అరెస్ట్
- అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- యూఏఈ స్వచ్ఛంద చమురు ఉత్పత్తి కోత పొడిగింపు
- హైదరాబాద్లో భారీ వర్షం..
- తొమ్మిదేళ్ల పాలనలో కెసిఆర్ రూ. 5 లక్షల కోట్ల అప్పు చేశారు: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కొత్త బయోమెట్రిక్ కేంద్రాలు: ప్రవాసులకు రెండు, పౌరులకు మూడు
- భారత రైలు ప్రమాదంపై యూఏఈ అధ్యక్షుడు సంతాపం