రైతుకు ప్రధాన సమస్య నకిలీ విత్తనాలే : సీపీ స్టీఫెన్ రవీంద్ర
- May 26, 2023
హైదరాబాద్: ఒక సగటు రైతుకు అతి పెద్ద సమస్య ఏంటంటే.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడో, వడగళ్లు పడ్డప్పుడో, కరువు వచ్చినప్పుడో కాదు.. ఒక రైతుకు నకిలీ విత్తనాలే ప్రధాన సమస్య అని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. కరువు వచ్చినప్పుడో, వడగండ్లు పడ్డప్పుడో రైతు 50 శాతం పంట మాత్రమే నష్టపోతాడు.. కానీ నకిలీ విత్తనం మొత్తం రైతును, రైతు కష్టాన్ని తుడిచిపెట్టేస్తుందని ఆయన అన్నారు.సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో 80 శాతం నుంచి 90 శాతం వరకు నకిలీ విత్తనాల బెడద తగ్గిందని సీపీ తెలిపారు. ఇంకా అక్కడక్కడా ఈ మాఫియా ఉందన్నారు. వారినీ ఏరిపారేస్తాం. సీఎం నిత్యం రైతుల పట్ల, వారి క్షేమం పట్ల ఉండే ఆలోచనా దఅక్పథంతో, రైతు భద్రతే రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యత దఅష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మా పోలీస్ శాఖ కానీ రైతుల రక్షణకు ఎల్లపుడూ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా నకిలీ విత్తనాల మాఫియాపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నాం. వ్యవసాయ శాఖ, వ్యవసాయ వర్సిటీతో మా పోలీస్ శాఖ సమన్వయం చేసుకొని ఈ నకిలీ విత్తనాల మాఫియా పట్ల అత్యంత కఠినచర్యలతో ఉక్కుపాదంతో అణచివేస్తాం అని సీపీ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









