వలసదారులపై 'బ్యాన్‌' ఎకానమీ వృద్ధి చెందేదాకా

- May 11, 2016 , by Maagulf
వలసదారులపై 'బ్యాన్‌' ఎకానమీ వృద్ధి చెందేదాకా

వలసదారులకు రెండేళ్ళ ఎంప్లాయ్‌మెంట్‌ బ్యాన్‌ ఒమన్‌లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదాకా కొనసాగే అవకాశముంది. నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ (ఎన్‌ఓసి) లేకుండా ఉద్యోగాల్ని వదిలేసుకునేవారిపై రెండేళ్ళ బ్యాన్‌ కొనసాగుతోంది. ఈ బ్యాన్‌, ఒమన్‌లో ఎకానమీ మెరుగుపడేదాకా ఉండొచ్చని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీలు వలసదారులకు ట్రెయినింగ్‌ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నాయని అయితే ఎక్కువ జీతాలు వస్తున్నాయనే ఆలోచనతో వలసదారులు వేరే కంపెనీల్లోకి వెళ్ళిపోతున్నారని అలాంటివారి విషయంలో ఈ బ్యాన్‌ చాలా బాగా ఉపయోగపడ్తుందని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. లేబర్‌ మార్కెట్‌ని ఈ రెండేళ్ళ బ్యాన్‌ రూల్‌ నిలకడగా ఉంచుతుందని ఓ అధికార చెప్పారు. యజమాని అంగీకరిస్తేనే వలసదారుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారడానికి వీలుంది. లేని పక్షంలో వలసదారుడు రెండేళ్ళపాటు ఒమన్‌లో పనిచేసేందుకు అనర్హుడు. ఒమన్‌లో ప్రస్తుతం 30,000 మందికి పైగా ఒమనీయులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. చమురు ధరల పతనంతో ఆర్థికంగా దేశానికి ఇబ్బందికర పరిస్థితి. ఈ తరుణంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటే వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందని ఒమన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ మెంబర్‌ అహ్మద్‌ అల్‌ హూటి చెప్పారు. ఎన్‌ఓసి పద్ధతి ద్వారా ప్రొఫెషనల్స్‌కి ఇబ్బంది ఉండదని, ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు మారేవారికే ఇబ్బంది అని ఇండస్ట్రీ వర్గాలు వివరించాయి. అయితే ఈ బ్యాన్‌ కారణంగా వర్క్‌ ఫోర్స్‌ తగ్గడం, తద్వారా ప్రొడక్టివిటీ తగ్గిపోతుందనే వాదనలూ తెరపైకొస్తున్నాయి. ఏదేమైనా ఒమన్‌ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేదాకా రెండేళ్ళ బ్యాన్‌ వలసదారులపై తప్పకపోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com