వలసదారులపై 'బ్యాన్' ఎకానమీ వృద్ధి చెందేదాకా
- May 11, 2016
వలసదారులకు రెండేళ్ళ ఎంప్లాయ్మెంట్ బ్యాన్ ఒమన్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదాకా కొనసాగే అవకాశముంది. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసి) లేకుండా ఉద్యోగాల్ని వదిలేసుకునేవారిపై రెండేళ్ళ బ్యాన్ కొనసాగుతోంది. ఈ బ్యాన్, ఒమన్లో ఎకానమీ మెరుగుపడేదాకా ఉండొచ్చని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. కంపెనీలు వలసదారులకు ట్రెయినింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తున్నాయని అయితే ఎక్కువ జీతాలు వస్తున్నాయనే ఆలోచనతో వలసదారులు వేరే కంపెనీల్లోకి వెళ్ళిపోతున్నారని అలాంటివారి విషయంలో ఈ బ్యాన్ చాలా బాగా ఉపయోగపడ్తుందని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. లేబర్ మార్కెట్ని ఈ రెండేళ్ళ బ్యాన్ రూల్ నిలకడగా ఉంచుతుందని ఓ అధికార చెప్పారు. యజమాని అంగీకరిస్తేనే వలసదారుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారడానికి వీలుంది. లేని పక్షంలో వలసదారుడు రెండేళ్ళపాటు ఒమన్లో పనిచేసేందుకు అనర్హుడు. ఒమన్లో ప్రస్తుతం 30,000 మందికి పైగా ఒమనీయులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. చమురు ధరల పతనంతో ఆర్థికంగా దేశానికి ఇబ్బందికర పరిస్థితి. ఈ తరుణంలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలంటే వలసదారులపై కఠిన నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుందని ఒమన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మెంబర్ అహ్మద్ అల్ హూటి చెప్పారు. ఎన్ఓసి పద్ధతి ద్వారా ప్రొఫెషనల్స్కి ఇబ్బంది ఉండదని, ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు మారేవారికే ఇబ్బంది అని ఇండస్ట్రీ వర్గాలు వివరించాయి. అయితే ఈ బ్యాన్ కారణంగా వర్క్ ఫోర్స్ తగ్గడం, తద్వారా ప్రొడక్టివిటీ తగ్గిపోతుందనే వాదనలూ తెరపైకొస్తున్నాయి. ఏదేమైనా ఒమన్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేదాకా రెండేళ్ళ బ్యాన్ వలసదారులపై తప్పకపోవచ్చు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







