వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- May 29, 2023
బహ్రెయిన్: ఓ మహిళను నిర్దాక్షిణ్యంగా వ్యభిచార రొంపిలోకి దింపినందుకు ఇద్దరు మహిళలకు 10 ఏళ్ల జైలు శిక్షను హైకోర్టు అప్పీళ్ల కోర్టు సమర్థించింది. కోర్టు నేరస్తులకు BD2000 జరిమానా కూడా విధించింది. కోర్టు పత్రాల ప్రకారం.. ఇద్దరు మహిళలు బలవంతం, బెదిరింపులు, ఒత్తిడిని ఉపయోగించి బాధితురాలిని వ్యభిచారం వృత్తిలోకి దింపారు. ఆరు రోజుల పాటు ఆమెకు నరకం చూపారు. ఆ మహిళ సహాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. వారు పోలీసులకు సమాచారం అందించగా.. వారు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాధిత మహిళను రక్షించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులలో ఒకరు ఆమె బంధువు. మసాజ్ సేవలు అందించి డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి ఆమెను బహ్రెయిన్ తీసుకొచ్చారు. “నేను బహ్రెయిన్కు రాగానే, వాళ్లు ఎయిర్పోర్ట్లో నాకు స్వాగతం పలికి ఓ అపార్ట్మెంట్కి తీసుకెళ్లారు. అయితే, మరుసటి రోజు వారు నన్ను వ్యభిచారం చేయాలని డిమాండ్ చేస్తూ బెదిరించడం ప్రారంభించారు. కానీ నేను నిరాకరించాను. అప్పుడు వారు నా వీసా, ప్రయాణ ఖర్చుల కింద వెంటనే BD1,800 చెల్లించాలని డిమాండ్ చేశారు. నిస్సహాయంగా వాళ్ల ఒత్తిడి తలొగ్గాను. నా పరిస్థితిని రాయబార కార్యాలయానికి, పోలీసులకు తెలియజేయడానికి నాకు అవకాశం లభించే వరకు ఇది కొనసాగింది. ”అని బాధితురాలు ప్రాసిక్యూటర్లకు వివరించారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







