వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- May 29, 2023
బహ్రెయిన్: ఓ మహిళను నిర్దాక్షిణ్యంగా వ్యభిచార రొంపిలోకి దింపినందుకు ఇద్దరు మహిళలకు 10 ఏళ్ల జైలు శిక్షను హైకోర్టు అప్పీళ్ల కోర్టు సమర్థించింది. కోర్టు నేరస్తులకు BD2000 జరిమానా కూడా విధించింది. కోర్టు పత్రాల ప్రకారం.. ఇద్దరు మహిళలు బలవంతం, బెదిరింపులు, ఒత్తిడిని ఉపయోగించి బాధితురాలిని వ్యభిచారం వృత్తిలోకి దింపారు. ఆరు రోజుల పాటు ఆమెకు నరకం చూపారు. ఆ మహిళ సహాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. వారు పోలీసులకు సమాచారం అందించగా.. వారు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాధిత మహిళను రక్షించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులలో ఒకరు ఆమె బంధువు. మసాజ్ సేవలు అందించి డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి ఆమెను బహ్రెయిన్ తీసుకొచ్చారు. “నేను బహ్రెయిన్కు రాగానే, వాళ్లు ఎయిర్పోర్ట్లో నాకు స్వాగతం పలికి ఓ అపార్ట్మెంట్కి తీసుకెళ్లారు. అయితే, మరుసటి రోజు వారు నన్ను వ్యభిచారం చేయాలని డిమాండ్ చేస్తూ బెదిరించడం ప్రారంభించారు. కానీ నేను నిరాకరించాను. అప్పుడు వారు నా వీసా, ప్రయాణ ఖర్చుల కింద వెంటనే BD1,800 చెల్లించాలని డిమాండ్ చేశారు. నిస్సహాయంగా వాళ్ల ఒత్తిడి తలొగ్గాను. నా పరిస్థితిని రాయబార కార్యాలయానికి, పోలీసులకు తెలియజేయడానికి నాకు అవకాశం లభించే వరకు ఇది కొనసాగింది. ”అని బాధితురాలు ప్రాసిక్యూటర్లకు వివరించారు.
తాజా వార్తలు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం







