వ్యభిచార రింగ్ నడిపిన మహిళలకు 10 ఏళ్ల జైలుశిక్ష
- May 29, 2023
బహ్రెయిన్: ఓ మహిళను నిర్దాక్షిణ్యంగా వ్యభిచార రొంపిలోకి దింపినందుకు ఇద్దరు మహిళలకు 10 ఏళ్ల జైలు శిక్షను హైకోర్టు అప్పీళ్ల కోర్టు సమర్థించింది. కోర్టు నేరస్తులకు BD2000 జరిమానా కూడా విధించింది. కోర్టు పత్రాల ప్రకారం.. ఇద్దరు మహిళలు బలవంతం, బెదిరింపులు, ఒత్తిడిని ఉపయోగించి బాధితురాలిని వ్యభిచారం వృత్తిలోకి దింపారు. ఆరు రోజుల పాటు ఆమెకు నరకం చూపారు. ఆ మహిళ సహాయం కోసం రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. వారు పోలీసులకు సమాచారం అందించగా.. వారు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి బాధిత మహిళను రక్షించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులలో ఒకరు ఆమె బంధువు. మసాజ్ సేవలు అందించి డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపి ఆమెను బహ్రెయిన్ తీసుకొచ్చారు. “నేను బహ్రెయిన్కు రాగానే, వాళ్లు ఎయిర్పోర్ట్లో నాకు స్వాగతం పలికి ఓ అపార్ట్మెంట్కి తీసుకెళ్లారు. అయితే, మరుసటి రోజు వారు నన్ను వ్యభిచారం చేయాలని డిమాండ్ చేస్తూ బెదిరించడం ప్రారంభించారు. కానీ నేను నిరాకరించాను. అప్పుడు వారు నా వీసా, ప్రయాణ ఖర్చుల కింద వెంటనే BD1,800 చెల్లించాలని డిమాండ్ చేశారు. నిస్సహాయంగా వాళ్ల ఒత్తిడి తలొగ్గాను. నా పరిస్థితిని రాయబార కార్యాలయానికి, పోలీసులకు తెలియజేయడానికి నాకు అవకాశం లభించే వరకు ఇది కొనసాగింది. ”అని బాధితురాలు ప్రాసిక్యూటర్లకు వివరించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







