ఓపెన్ హౌజ్: కమ్యూనిటీకి ధన్యవాదాలు తెలిపిన భారత రాయబారి
- May 30, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం మే 26న ఓపెన్ హౌస్ను నిర్వహించింది. దీనికి రాయబారి పీయూష్ శ్రీవాస్తవ అధ్యక్షత వహించారు. ఎంబసీ కాన్సులర్ బృందం, న్యాయవాదుల ప్యానెల్ కూడా హాజరయ్యారు. ఓపెన్ హౌస్లో 60 మందికి పైగా భారతీయులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ పర్యటన సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు కమ్యూనిటీకి రాయబారి శ్రీవాస్తవ కృతజ్ఞతలు తెలిపారు. గత ఓపెన్ హౌజ్ లో లేవనెత్తిన చాలా సమస్యలకు పరిష్కారం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తక్షణమే సహాయ, సహకారాలు అందించిన స్థానిక అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనేక కాన్సులర్ మరియు కార్మిక సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేసినందుకు భారతీయ సమాజం, సంస్థలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బహ్రెయిన్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది భారతీయ కార్మికులు ఎంబసీ జోక్యంతో..లేబర్ మార్కెటింగ్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) సహకారంతో భారతదేశానికి తిరిగి వెళ్లారని గుర్తుచేశారు. ICWF ద్వారా అవసరమైన వ్యక్తులకు అత్యవసర ధృవీకరణ పత్రాలు, టిక్కెట్లను మంజూరు చేయడంతోపాటు, బోర్డింగ్, వసతిని అందించడం ద్వారా గృహిణులతో సహా బాధలో ఉన్న భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం చేయడం కొనసాగించిందన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!









