ఓపెన్ హౌజ్: కమ్యూనిటీకి ధన్యవాదాలు తెలిపిన భారత రాయబారి
- May 30, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం మే 26న ఓపెన్ హౌస్ను నిర్వహించింది. దీనికి రాయబారి పీయూష్ శ్రీవాస్తవ అధ్యక్షత వహించారు. ఎంబసీ కాన్సులర్ బృందం, న్యాయవాదుల ప్యానెల్ కూడా హాజరయ్యారు. ఓపెన్ హౌస్లో 60 మందికి పైగా భారతీయులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ పర్యటన సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు కమ్యూనిటీకి రాయబారి శ్రీవాస్తవ కృతజ్ఞతలు తెలిపారు. గత ఓపెన్ హౌజ్ లో లేవనెత్తిన చాలా సమస్యలకు పరిష్కారం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తక్షణమే సహాయ, సహకారాలు అందించిన స్థానిక అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనేక కాన్సులర్ మరియు కార్మిక సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేసినందుకు భారతీయ సమాజం, సంస్థలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బహ్రెయిన్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది భారతీయ కార్మికులు ఎంబసీ జోక్యంతో..లేబర్ మార్కెటింగ్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) సహకారంతో భారతదేశానికి తిరిగి వెళ్లారని గుర్తుచేశారు. ICWF ద్వారా అవసరమైన వ్యక్తులకు అత్యవసర ధృవీకరణ పత్రాలు, టిక్కెట్లను మంజూరు చేయడంతోపాటు, బోర్డింగ్, వసతిని అందించడం ద్వారా గృహిణులతో సహా బాధలో ఉన్న భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం చేయడం కొనసాగించిందన్నారు.
తాజా వార్తలు
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







