ఓపెన్ హౌజ్: కమ్యూనిటీకి ధన్యవాదాలు తెలిపిన భారత రాయబారి
- May 30, 2023
బహ్రెయిన్: భారత రాయబార కార్యాలయం మే 26న ఓపెన్ హౌస్ను నిర్వహించింది. దీనికి రాయబారి పీయూష్ శ్రీవాస్తవ అధ్యక్షత వహించారు. ఎంబసీ కాన్సులర్ బృందం, న్యాయవాదుల ప్యానెల్ కూడా హాజరయ్యారు. ఓపెన్ హౌస్లో 60 మందికి పైగా భారతీయులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ పర్యటన సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొన్నందుకు కమ్యూనిటీకి రాయబారి శ్రీవాస్తవ కృతజ్ఞతలు తెలిపారు. గత ఓపెన్ హౌజ్ లో లేవనెత్తిన చాలా సమస్యలకు పరిష్కారం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తక్షణమే సహాయ, సహకారాలు అందించిన స్థానిక అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనేక కాన్సులర్ మరియు కార్మిక సమస్యలను పరిష్కరించడంలో సహాయం చేసినందుకు భారతీయ సమాజం, సంస్థలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బహ్రెయిన్ లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది భారతీయ కార్మికులు ఎంబసీ జోక్యంతో..లేబర్ మార్కెటింగ్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) సహకారంతో భారతదేశానికి తిరిగి వెళ్లారని గుర్తుచేశారు. ICWF ద్వారా అవసరమైన వ్యక్తులకు అత్యవసర ధృవీకరణ పత్రాలు, టిక్కెట్లను మంజూరు చేయడంతోపాటు, బోర్డింగ్, వసతిని అందించడం ద్వారా గృహిణులతో సహా బాధలో ఉన్న భారతీయ పౌరులకు ఎంబసీ సహాయం చేయడం కొనసాగించిందన్నారు.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







