జగన్ నాలుగేళ్ల పాలన పై స్పందించిన చంద్రబాబు నాయుడు
- May 30, 2023
అమరావతి: ఏపి సిఎం జగన్ నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. నాలుగేళ్ల క్రితం ఇదే రోజున సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు వేడుకలు జరుపుకుంటుండగా… విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. టిడిపి అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. జగన్ సీఎం అయిన వెంటనే అమరావతిలోని ప్రజావేదికను కూల్చి వేసిన సంగతి తెలిసిందే. అధికారులతో సమావేశం సందర్భంగా జగన్ మాట్లాడుతూ… తొలి కూల్చివేత ఈ బిల్డింగ్ తో ప్రారంభమవుతుందని జగన్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను చంద్రబాబు షేర్ చేశారు. ‘నిజమే. తొలి రోజు మీరు ఏం చెప్పారో మీ ప్రభుత్వం దాన్నే తూచ తప్పకుండా అమలు చేస్తోంది. ఏపీ విధ్వంసం ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమయింది… ఆ విధ్వంసం ఐదో ఏడాది కూడా కొనసాగుతోంది’ అని చంద్రబాబు అన్నారు. దీంతోపాటు ప్రజావేదికను కూల్చుతున్న వీడియోను కూడా షేర్ చేశారు.
తాజా వార్తలు
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు
- టర్కీ విదేశాంగ మంత్రితో GCC, జోర్డాన్ రాయబారులు భేటీ..!!
- వాగులో చిక్కుకున్న వాహనం..ముగ్గురిని రక్షించిన సీడీఏఏ..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు.. అలెర్ట్ జారీ..!!
- కువైట్ లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు నమోదు..!!









