ఖర్జూర ఉత్పత్తిలో జీసీసీలో ఒమన్ కు రెండవ స్థానం
- May 31, 2023
మస్కట్: సుల్తానేట్లోని ఒకటి కంటే ఎక్కువ విలాయత్లలో ఖర్జూరాల సీజన్ ప్రారంభమైంది. సుల్తానేట్లో ఖర్జూర చెట్ల సంఖ్య 9 మిలియన్లకు పైగా ఉన్నదని, ఒమన్ సుల్తానేట్ ప్రస్తుతం ఖర్జూర ఉత్పత్తిలో అగ్రగామి దేశాల్లో ఒకటిగా ఉందని, ప్రపంచంలో ఎనిమిదో స్థానంలో మరియు గల్ఫ్లో రెండవ స్థానంలో ఉందని వ్యవసాయం, మత్స్య, జలవనరుల మంత్రిత్వ శాఖలో నిపుణుడు ఇంజనీర్ హైథమ్ బిన్ బదర్ అల్-ఖంజరి తెలిపారు. 62,000 ఎకరాల విస్తీర్ణంలో ఖర్జూర పంట విస్తరించి ఉందని, ఒక తాటికి ప్రపంచ సగటు 40 కేజీలతో పోలిస్తే..51 కిలోల ఉత్పాదకతో ఒమన్ ముందు వరుసలో ఉందన్నారు. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ఖర్జూరం 2021లో 374,000 టన్నులకు చేరుకుందని, వినియోగానికి 53% పోగా 4% తయారీకి.. 4% ఎగుమతికి.. మిగిలినవి పశుగ్రాసంగా ఉపయోగించబడ్డాయన్నారు. 2021 గణాంకాల ప్రకారం.. 26,817 టన్నుల ఉత్పత్తితో ఒమన్ సుల్తానేట్లో ఇబ్రి విలాయత్ అత్యంత ఉత్పాదక రాష్ట్రంగా నిలిచిందన్నారు.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









