తృణధాన్యాల బాక్సుల్లో 7 కిలోల డ్రగ్స్..ఎయిర్పోర్టులో చిక్కిన వ్యక్తి
- May 31, 2023
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (డిఎక్స్బి)లో 7.06 కిలోల గంజాయితో ఒక ఆసియా యాత్రికుడు పట్టుబడినట్లు అధికారులు తెలిపారు. అతను ప్రముఖ తృణధాన్యాల బ్రాండ్కు చెందిన బాక్సుల్లో డ్రగ్స్ను దాచి తరలిస్తున్నట్లు గుర్తించినట్లు దుబాయ్ కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని, స్మగ్లర్పై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
దుబాయ్ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ప్యాసింజర్ కార్యకలాపాల సీనియర్ డైరెక్టర్ ఖాలీద్ అహ్మద్ మాట్లాడుతూ.. కొందరు మాదకద్రవ్యాలను సౌందర్య సాధనాలలో దాచిపెడతారని చెప్పారు. మరికొందరు బట్టలలో దాచుతారు. దీంతోపాటు కాలానుగుణ పండ్లు, సుగంధ ద్రవ్యాల సంచులలో వాటిని దాచి తరలిస్తారు. అయితే, కస్టమ్స్ అధికారులు హైటెక్ తనిఖీ పరికరాలను ఉపయోగిస్తున్నారని, దీంతో డ్రగ్స్, ఇతర నిషిద్ధ వస్తువులను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాలను విఫలం చేయడానికి వీలవుతుందన్నారు.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







