అంతర్జాతీయ వేదికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించిన ఇండియా,కువైట్
- June 02, 2023
కువైట్: భారతదేశం, కువైట్ మధ్య ఐక్యరాజ్యసమితి సహా పలు అంతర్జాతీయ వేదికలపై అనుసరించాల్సిన వ్యూహాలపై సంప్రదింపులు కువైట్ నగరంలో జరిగాయి. కువైట్ తరఫున అంతర్జాతీయ సంస్థల సహాయ మంత్రి అబ్దుల్ అజీజ్ సౌద్ మహ్మద్ అల్-జరల్లా చర్చలకు నాయకత్వం వహించగా.. భారత ప్రతినిధి బృందానికి యూఎన్ పొలిటికల్ జాయింట్ సెక్రటరీ ప్రకాష్ గుప్తా, కువైట్లోని భారత రాయబారి డా. ఆదర్శ్ స్వైకా నాయకత్వం వహించారు. రెండు దేశాల మధ్య ఈ తరహా సంప్రదింపులు ఇదే మొదటిది. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి సహా ఇతర అంతర్జాతీయ సంస్థలలో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. నామ్(NAM), G-77 ఫ్రేమ్వర్క్లో సహకారంతో సహా బహుపాక్షిక వేదికలపై పరస్పర ఆసక్తి ఉన్న రంగాలపై ఇరు దేశాల నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- వైభవంగా ‘గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్’ వేడుక.. చిరంజీవి, నాగార్జున, కమల్ హాసన్ సందడి..
- సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026లో జట్ల హెడ్కోచ్లు వీళ్లే
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు









