జిలీబ్ అల్-షుయౌఖ్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు వ్యక్తులు మృతి
- June 03, 2023
కువైట్: జిలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని కువైట్ ఫైర్ ఫోర్స్ (KFF) ఒక ప్రకటనలో తెలిపింది. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశంలో సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదానికి కారణంగా తెలిపింది. అలాగే ప్రమాదం జరిగి సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఇంటిలోకి ప్రవేశించకుండా తలుపులు, ఇనుప కడ్డీలు వంటీ స్క్రాప్ లు ఉన్నాయని, దాంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ఇంటి యజమానులు తమ భవనాల భద్రతను నిర్ధారించుకోవాలని, అగ్నిమాపక సిబ్బందికి ఆటంకం కలిగించే స్క్రాప్లను నిల్వ చేయకుండా అద్దెదారులను నిరోధించాలని కువైట్ ఫైర్ ఫోర్స్ సూచించింది.
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







