జిలీబ్ అల్-షుయౌఖ్లో అగ్నిప్రమాదం.. ముగ్గురు వ్యక్తులు మృతి
- June 03, 2023
కువైట్: జిలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో గురువారం రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందని కువైట్ ఫైర్ ఫోర్స్ (KFF) ఒక ప్రకటనలో తెలిపింది. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ప్రదేశంలో సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవడం ప్రమాదానికి కారణంగా తెలిపింది. అలాగే ప్రమాదం జరిగి సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఇంటిలోకి ప్రవేశించకుండా తలుపులు, ఇనుప కడ్డీలు వంటీ స్క్రాప్ లు ఉన్నాయని, దాంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. ఇంటి యజమానులు తమ భవనాల భద్రతను నిర్ధారించుకోవాలని, అగ్నిమాపక సిబ్బందికి ఆటంకం కలిగించే స్క్రాప్లను నిల్వ చేయకుండా అద్దెదారులను నిరోధించాలని కువైట్ ఫైర్ ఫోర్స్ సూచించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







