అజ్మాన్ లో ఇంధన ట్యాంక్ పేలిన ఘటనలో ఇద్దరు మృతి
- June 05, 2023

యూఏఈ: అజ్మాన్ లోని అల్ జుర్ఫ్ పారిశ్రామిక ప్రాంతంలో ఇంధన ట్యాంక్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. ముగ్గురు గాయపడ్డారు. మృతులను ఆసియన్లుగా గుర్తించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు పేలుడు సంభవించినట్లు తమకు సమాచారం అందిందని అజ్మాన్ పోలీసులు తెలిపారు. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిందని అజ్మాన్ పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నుయిమి వెల్లడించారు. కార్మికులు ట్యాంకుల్లో ఒకదానిపై వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి పేలుడుకు దారితీసింది. భద్రతా నిబంధనలను పాటించకపోవడం వల్లే పేలుడు సంభవించిందని అజ్మాన్ పోలీస్ చీఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







