మస్కట్లో పొగాకు ఉత్పత్తులపై ఉక్కుపాదం
- June 07, 2023మస్కట్: మస్కట్ గవర్నరేట్లో సుమారు 3,000 బ్యాగుల నమిలే పొగాకును స్వాధీనం చేసుకున్నారు. కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA)లోని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చూయింగ్ పొగాకు తయారీ, అమ్మకం కోసం ముడి పదార్థాలుగా వినియోగిస్తున్న దాదాపు 3,000 బ్యాగుల పొగాకును స్వాధీనం చేసుకున్నారు. ఖురయ్యత్లో ఈ పొగాకు తయారీ, వ్యాపారం నిర్వహిస్తున్న ఒక ప్రవాస కార్మికుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఖురయ్యాత్ విలాయత్లోని పారిశ్రామిక ప్రాంతంలో పొగాకును రవాణా చేయడానికి ఉపయోగించే స్థలం గురించి నోటిఫికేషన్ను అందుకుందని, లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోటిఫికేషన్ సైట్కు వెళ్లారని అధికారులు వెల్లడించారు. పొగాకు కొనుగోలు చేస్తున్నట్లు నటించి.. ప్రవాస కార్మికుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్టు తెలిపారు. విచారణలో కార్మికుడు మరొక ప్రవాస కార్మికుడి నుండి ముడి పదార్థాలను కొనుగోలు చేసిన తర్వాత పొగ లేని నమిలే పొగాకు తయారీ మరియు వ్యాపారం చేసినట్లు ఒప్పుకున్నాడు. వినియోగదారుల రక్షణ చట్టం, రిజల్యూషన్ నెం. (256/2015) కేసు నమోదు చేసారు. రిజల్యూషన్ నెం. (301/2016) ద్వారా సవరించబడిన నిబంధన ప్రకారం నమిలే పొగాకు (పొగ లేనిది )పై నిషేధం విధించారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం