ఇండియాలో 50 శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!
- June 07, 2023
యూఏఈ: భారతదేశంలో విమాన ఛార్జీలు 50% పైగా పెరిగాయి. భారతదేశంలో దేశీయంగా ప్రయాణించాలని యోచిస్తున్న యూఏఈ నివాసితులు దేశీయ విమానాల కోసం అధిక విమాన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ట్రావెల్ ఏజెంట్లు చేబుతున్నారు. భారతదేశంలో ప్రయాణించడానికి విమాన ఛార్జీలు కొన్ని నగరాల మధ్య దాదాపు 50 శాతం పెరిగాయని రీగల్ టూర్స్ వరల్డ్వైడ్లో ఇన్బౌండ్ మరియు అవుట్బౌండ్ కార్యకలాపాల సీనియర్ మేనేజర్ సుబైర్ తెకెపురత్వాలాప్పిల్ తెలిపారు. ప్లూటో ట్రావెల్స్లో మేనేజింగ్ పార్టనర్ భరత్ ఐదాసాని కూడా భారత్లో దేశీయంగా ప్రయాణించే నివాసితులు “విమాన ఛార్జీలు పెరిగినందున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది” అని ధృవీకరించారు.విమాన ఛార్జీలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయని “వేసవి సెలవుల కోసం GCC దేశాల నుండి వేలాది మంది ప్రజలు భారతదేశానికి ప్రయాణిస్తున్నారు. వారిలో చాలా మంది బంధువులను కలవడానికి లేదా పర్యాటకం కోసం వివిధ నగరాలకు వెళతారు. దీని కారణంగా భారీ డిమాండ్ ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి.' అని ఐదాసాని అన్నారు. ఇదే సమయంలో పెరిగిన ఇంధన ధరలు మరియు గోఫస్ట్ ఎయిర్లైన్స్ మూతపడటం వంటివి విమాన ఛార్జీల పెరుగుదలకు దోహదపడ్డాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో చివరి లాంగ్ వీకెండ్: Dh725 నుండి ట్రావెల్ డీల్స్
- యూఏఈ ఐఫోన్ 15: ఆపిల్ స్టోర్ కు పోటెత్తిన కొనుగోలుదారులు
- గ్లోబల్ టాలెంట్ ర్యాంకింగ్స్.. బహ్రెయిన్ కు టాప్ ర్యాంకులు
- 38 క్రిమినల్ కేసులలో నిందితుడైన భారతీయ ప్రవాసి అరెస్ట్
- కల్తీ ఉత్పత్తుల తయారీ..నివాసితుడికి 2 సంవత్సరాల జైలు, SR20000 జరిమానా
- హైదరాబాద్ విమానాశ్రయాన్ని సందర్శించిన నేషనల్ కమిషన్ వైస్ చైర్మన్
- ఒమన్, స్లోవేకియా మధ్య వీసా మినహాయింపు ఒప్పందం
- భారతీయ వైద్యులకు గుడ్ న్యూస్..
- ఓటరుగా నమోదుకు ఆధార్ నంబర్ తప్పనిసరి కాదు
- చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు