ఇండియాలో 50 శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!
- June 07, 2023
యూఏఈ: భారతదేశంలో విమాన ఛార్జీలు 50% పైగా పెరిగాయి. భారతదేశంలో దేశీయంగా ప్రయాణించాలని యోచిస్తున్న యూఏఈ నివాసితులు దేశీయ విమానాల కోసం అధిక విమాన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ట్రావెల్ ఏజెంట్లు చేబుతున్నారు. భారతదేశంలో ప్రయాణించడానికి విమాన ఛార్జీలు కొన్ని నగరాల మధ్య దాదాపు 50 శాతం పెరిగాయని రీగల్ టూర్స్ వరల్డ్వైడ్లో ఇన్బౌండ్ మరియు అవుట్బౌండ్ కార్యకలాపాల సీనియర్ మేనేజర్ సుబైర్ తెకెపురత్వాలాప్పిల్ తెలిపారు. ప్లూటో ట్రావెల్స్లో మేనేజింగ్ పార్టనర్ భరత్ ఐదాసాని కూడా భారత్లో దేశీయంగా ప్రయాణించే నివాసితులు “విమాన ఛార్జీలు పెరిగినందున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది” అని ధృవీకరించారు.విమాన ఛార్జీలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయని “వేసవి సెలవుల కోసం GCC దేశాల నుండి వేలాది మంది ప్రజలు భారతదేశానికి ప్రయాణిస్తున్నారు. వారిలో చాలా మంది బంధువులను కలవడానికి లేదా పర్యాటకం కోసం వివిధ నగరాలకు వెళతారు. దీని కారణంగా భారీ డిమాండ్ ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి.' అని ఐదాసాని అన్నారు. ఇదే సమయంలో పెరిగిన ఇంధన ధరలు మరియు గోఫస్ట్ ఎయిర్లైన్స్ మూతపడటం వంటివి విమాన ఛార్జీల పెరుగుదలకు దోహదపడ్డాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!
- ఒమన్లో 42వేల వాణిజ్య రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- యూఏఈలో న్యూఇయర్ ఫైర్ వర్క్స్ జరిగే ప్రాంతాలు..!!
- గల్ఫ్-ఈయూ పార్టనర్షిప్, ఇంధన భద్రత తప్పనిసరి..!!
- సౌదీలో లేబర్, బార్డర్ చట్టాల ఉల్లంఘనదారులు అరెస్టు..!!
- గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి
- తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు..
- విదేశాల్లో ఉన్నవారికి అండగా ఉంటాం: మంత్రి లోకేశ్
- డాక్టర్ అనురాధ కోడూరి ‘మై బాలీవుడ్ రొమాన్స్’ నవల ఆవిష్కరణ







