ఇండియాలో 50 శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!
- June 07, 2023![1 ఇండియాలో 50 శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!](https://www.maagulf.com/godata/articles/202306/bbb_1686110364.jpg)
యూఏఈ: భారతదేశంలో విమాన ఛార్జీలు 50% పైగా పెరిగాయి. భారతదేశంలో దేశీయంగా ప్రయాణించాలని యోచిస్తున్న యూఏఈ నివాసితులు దేశీయ విమానాల కోసం అధిక విమాన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని ట్రావెల్ ఏజెంట్లు చేబుతున్నారు. భారతదేశంలో ప్రయాణించడానికి విమాన ఛార్జీలు కొన్ని నగరాల మధ్య దాదాపు 50 శాతం పెరిగాయని రీగల్ టూర్స్ వరల్డ్వైడ్లో ఇన్బౌండ్ మరియు అవుట్బౌండ్ కార్యకలాపాల సీనియర్ మేనేజర్ సుబైర్ తెకెపురత్వాలాప్పిల్ తెలిపారు. ప్లూటో ట్రావెల్స్లో మేనేజింగ్ పార్టనర్ భరత్ ఐదాసాని కూడా భారత్లో దేశీయంగా ప్రయాణించే నివాసితులు “విమాన ఛార్జీలు పెరిగినందున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది” అని ధృవీకరించారు.విమాన ఛార్జీలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయని “వేసవి సెలవుల కోసం GCC దేశాల నుండి వేలాది మంది ప్రజలు భారతదేశానికి ప్రయాణిస్తున్నారు. వారిలో చాలా మంది బంధువులను కలవడానికి లేదా పర్యాటకం కోసం వివిధ నగరాలకు వెళతారు. దీని కారణంగా భారీ డిమాండ్ ఏర్పడి ధరలు భారీగా పెరిగాయి.' అని ఐదాసాని అన్నారు. ఇదే సమయంలో పెరిగిన ఇంధన ధరలు మరియు గోఫస్ట్ ఎయిర్లైన్స్ మూతపడటం వంటివి విమాన ఛార్జీల పెరుగుదలకు దోహదపడ్డాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో ధూళి తుఫానులు..అలెర్ట్ జారీ
- నవజాత శిశువుల స్క్రీనింగ్.. యూఏఈలో కొత్త మార్గదర్శకాలు
- 'మాస్టర్ ఆఫ్ డవలప్ మెంట్ ఎక్సలెన్స్ అవార్డు-2024'ను సొంతం చేసుకున్న అన్వితా గ్రూప్
- రేపటి భారత క్రీడా షెడ్యూల్ ఇదే..
- మద్యం కుంభకోణంలో జగన్ ను వదిలేది లేదు: మంత్రి కొల్లు రవీంద్ర
- షిర్డీ సాయినాధుని సేవలో ఏపీ గవర్నర్
- ఆసియా కప్: పాక్ పై విజయం…ఫైనల్స్ కు శ్రీలంక
- ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త
- రాచకొండ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యం: సిపీ సుధీర్ బాబు
- విషాదం..భవనం పైకప్పుపై ప్రవాస భారతీయుడి మృతదేహం లభ్యం..!