WTC final2023: చరిత్రాత్మక మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా
- June 07, 2023
ఓవల్: చరిత్రాత్మక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 (wtc final) ఫైనల్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి ఆస్ట్రేలియాను బ్యాటింగ్కు ఆహ్వానించాడు. పిచ్ కండీషన్, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ ఎంచుకున్నట్టు రోహిత్ తెలిపాడు. నలుగురు సీమర్స్, ఒక స్పిన్నర్ జడేజాతో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. పిచ్ విషయానికి వస్తే.. అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంది. పిచ్పై బంతి స్వింగ్ అయ్యే అవకాశాలున్నాయి. పిచ్పై పచ్చని పచ్చిక ఉంది. కాబట్టి సీమ్ కూడా లభించే ఛాన్స్ ఉంది. చక్కటి బౌన్స్ లభించనుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.
తుది జట్లు..
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజ, లబుషేన్, స్టీవెన్ స్మిట్, ట్రావీస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్సీ క్యారీ(వికెట్ కీపర్), ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బొలాండ్.
ఇండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్ధూల్ థాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
కాగా ఈసారి ఎలాగైనా డబ్ల్యూటీసీ ట్రోఫీ దక్కించుకోవాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. గత సీజన్లో ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమితో టీమిండియా ట్రోఫీని కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







