జన్మభూమికి సేవ చేసిన నిజామాబాద్ జిల్లా వాసి
- June 22, 2015
కృషితో నాస్తి దుర్బిక్షం అని మరో మారు నిరుపించాడు నిజామాబాద్ జిల్లా వాసి పయ్యావుల శ్రీనివాస్ గారు తన స్వగ్రామం: మండలం: సదాశివనగర్ గ్రామం : వడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానకి చెందిన పయ్యావుల శ్రీనివాస్ గారు తన స్వగ్రామాన్ని విడిచి గత 13 సంవత్సరాల క్రితం 2002 లో ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లాడు.అక్కడ అతను ఒక కంపెని లో హెల్పర్ గా పని చేస్తూ తోటి వారి కష్టసుఖాలలో పాలుపంచుకునేవాడు అలా అతని మదిలో ఒక ఆలొచన బావం కలిగింది.తన దృడమైన సంకల్పంతో ఒక చిన్న కంపెనీని స్థాపించారు.తన తోటివారికి తన కంపెని లో ఉద్యోగం కల్పించి వారికి ఆసరాగ నిలిచారు.తన కుటుంబ సమెతంగా వారు లో స్థిర పడ్డారు అలా అంచెలంచెలుగా ఎదుగుతు తోటివారికి సహయపడుతున్నారు సుమారు 400కు పైగా కార్మికులకు ఉపాది కల్పిస్తూన్నారు.అతను ఎంత ఎదిగిన తన స్వ గ్రామాన్ని ఎప్పుడూ కూడా మరవలేదు.తన గ్రామా ప్రజల కష్ట సుఖాలను తెలుసు కుంటూ వారికి తన వంతు సహాయసహకారాలు అందజేస్తున్నారు.తను ఇంత ఎదగడానికి తన తల్లిదండ్రుల,మరియు కుటుంబ సభ్యులు,బంధుమిత్రుల ప్రోత్సహం తో ఎదిగానని వారికి ఎప్పుడు ఋణపడి ఉంటానని చెప్పారు.అలాగే తన ఇష్ట దైవమైన ఆంజనేయస్వామి ఆశీస్సులు ఉండడంవల్ల ఈస్థాయికి చెరుకున్నాని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాస్థానంలో తన యొక్క చిన్నకానుకగా ఒక మంచినీటి ట్యాంక్ మరియు ఒక లడ్డూ కౌంటర్ ఏర్పాటుచేశారు.మరెన్నో స్వచ్ఛంద స్వంస్థలకు విరాలాలు అందజేస్తున్నారు.బహ్రెయిన్ న్యూస్ రిపోటర్ వాసు గారితో తన భావాలను పంచుకున్నారు.బహ్రెయిన్ న్యూస్ ప్లస్...ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకి వెళ్ళాలి జన్మభూమికి ఎంతో కొంత సహాయసహకారాలు అందించాలి.
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









