షువైఖ్లో కొత్త హైపర్మార్కెట్ను ప్రారంభించిన భారత రాయబారి
- June 11, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబారి, హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ ఆదర్శ్ స్వైకా జూన్ 10వ తేదీ (శనివారం) షువైఖ్లో కొత్త హైపర్మార్కెట్ను ప్రారంభించారు. అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరాన్ని పురస్కరించుకుని, అల్ హకీమి హైపర్ మార్కెట్లో అంబాసిడర్ ప్రత్యేక మిల్లెట్ కౌంటర్ను కూడా ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో సయ్యద్ తాహా హకీముద్దీన్, మిస్టర్ కైజర్ టి షాకిర్, మిస్టర్ కుల్దీప్ సింగ్ లాంబా, మిస్టర్ అబ్దుల్ రెడా అబ్దుల్లా నాజర్ అల్ హెర్జ్, మిస్టర్ అబ్దుల్లా అబ్దుల్ రెడా అల్ హెర్జ్, డాక్టర్ ఇమాద్ ముస్తఫా, మిస్టర్ నాజర్ అల్ యూసుఫ్, మిస్టర్ అబ్దుల్లా సలాహుద్దీన్ సహా ప్రముఖ అతిథులు పాల్గొన్నారు.
షోరూమ్ను ప్రారంభించిన సందర్భంగా అంబాసిడర్ డాక్టర్ ఆదర్శ్ స్వైకా మాట్లాడుతూ, "ఈ హకీమి సూపర్మార్కెట్లో మిల్లెట్లు, ఇండియా మసాలాలు మరియు అనేక ఇతర భారతీయ ఉత్పత్తుల శ్రేణి నన్ను నిజంగా ఆకట్టుకుంది.’’ అని తెలిపారు.
నాణ్యత, కస్టమర్ సేవా సూత్రాలపై స్థాపించబడిన అల్-హకిమి సూపర్మార్కెట్ 2007 నుండి ఆహార పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు మరియు గృహోపకరణాలను విక్రయిస్తోంది. ఈ షోరూమ్ అనేక రకాల భారతీయ సుగంధ ద్రవ్యాలు, ఆయుర్వేద మూలికలకు ప్రసిద్ధి చెందింది.
తాజా వార్తలు
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక







