ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ఎగుమతిదారుల్లో ఒకటిగా ఒమన్..!
- June 12, 2023
పారిస్: ఒమన్ సుల్తానేట్ 2030 నాటికి ప్రపంచంలోనే హైడ్రోజన్ను అత్యధికంగా ఎగుమతి చేసే దేశాలలో ఒకటిగా అవతరించబోతోంది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ అండ్ మినరల్స్ మరియు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (IEA) సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేసింది. పునరుత్పాదక శక్తి, హైడ్రోజన్కు కేంద్రంగా ఒమన్ దూసుకుపోతుందని పేర్కొంది. పారిస్లోని IEA ప్రధాన కార్యాలయానికి ఒమానీ ప్రతినిధి బృందం చేసిన పర్యటన సందర్భంగా నివేదికను సమీక్షించారు. ప్రతినిధి బృందానికి ఇంధనం, ఖనిజాల శాఖ మంత్రి ఇంజి. సలీం నాసర్ అల్ ఔఫీ అధ్యక్షత వహించారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను దశలవారీగా తేవడానికి ఒమన్ అల్ వుస్తా, ధోఫర్ గవర్నరేట్లలో 50,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రాంతాన్ని కేటాయించింది. ఇది క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ల కోసం ఇతర గవర్నరేట్లలో 15,000 చదరపు కిలోమీటర్లకు ఇది అదనమని సలీం నాసర్ అల్ ఔఫీ వెల్లడించారు.
ఒమన్ 2030 నాటికి ఒక మిలియన్ టన్నుల కంటే ఎక్కువ గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేయాలని యోచిస్తోంది. ప్రస్తుతం కేటాయించిన భూమిలో 30 శాతం వరకు దోపిడీ (2050 నాటికి) సుమారు 8 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేయడానికి ఈ ప్రణాళిక అందిస్తుంది. ప్రాజెక్టుల పెట్టుబడి విలువ 140 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇటీవల, శక్తి పరివర్తన మరియు వాతావరణ మార్పులలో ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా ఒమన్ చర్యలు చేపట్టింది. ఒమన్ 2050 నాటికి కార్బన్ న్యూట్రాలిటీ లేదా జీరో కార్బన్ ఉద్గారాలను సాధించడానికి ప్రణాళికలను రూపొందించింది.
తాజా వార్తలు
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం







