ట్రక్కుని ఢీకొట్టి.. మంటల్లో చిక్కుకుని డ్రైవర్ మృతి
- June 12, 2023
దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో ట్రక్కును ఢీకొట్టి మంటలు చెలరేగడంతో అందులో చిక్కుకొని కారు డ్రైవర్ మృతి చెందాడు. ట్రాఫిక్ రిజిస్ట్రేషన్ హెడ్, బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ కెప్టెన్ అహ్మద్ ఖల్ఫాన్ బిన్ లాహెజ్ మాట్లాడుతూ.. వాహనదారుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో అక్రమంగా నిష్క్రమించడానికి ప్రయత్నించాడని తెలిపారు. అతని వాహనం అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. దాంతో కారులో మంటలు చెలరేగాయని, అందులో చిక్కుకొని డ్రైవర్ మరణించాడని పేర్కొన్నారు. డ్రైవర్ వెంటనే మృతి చెందగా, కారు పూర్తిగా ధ్వంసమైంది. కాలిపోయిన వాహనం నంబర్ ప్లేట్ నుండి పోలీసులకు కేవలం రెండు అంకెలు మాత్రమే లభించాయి.దీంతో మృతుడి గుర్తింపును నిర్ధారించడం కష్టంగా మారింది. ఘటన జరిగిన ప్రాంతంలో లభించిన చిన్న కాగితం ముక్క ఆధారంగా వాహనం యజమానిని ట్రేస్ చేసి సంప్రదించగా, అతను తన కారును స్నేహితుడికి ఇచ్చినట్టుగా చెప్పాడు. ఈ సమాచారం ఆధారంగా మృతుడిని గుర్తించినట్లు బిన్ లాహెజ్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







