ట్రక్కుని ఢీకొట్టి.. మంటల్లో చిక్కుకుని డ్రైవర్ మృతి
- June 12, 2023
దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో ట్రక్కును ఢీకొట్టి మంటలు చెలరేగడంతో అందులో చిక్కుకొని కారు డ్రైవర్ మృతి చెందాడు. ట్రాఫిక్ రిజిస్ట్రేషన్ హెడ్, బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ కెప్టెన్ అహ్మద్ ఖల్ఫాన్ బిన్ లాహెజ్ మాట్లాడుతూ.. వాహనదారుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో అక్రమంగా నిష్క్రమించడానికి ప్రయత్నించాడని తెలిపారు. అతని వాహనం అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. దాంతో కారులో మంటలు చెలరేగాయని, అందులో చిక్కుకొని డ్రైవర్ మరణించాడని పేర్కొన్నారు. డ్రైవర్ వెంటనే మృతి చెందగా, కారు పూర్తిగా ధ్వంసమైంది. కాలిపోయిన వాహనం నంబర్ ప్లేట్ నుండి పోలీసులకు కేవలం రెండు అంకెలు మాత్రమే లభించాయి.దీంతో మృతుడి గుర్తింపును నిర్ధారించడం కష్టంగా మారింది. ఘటన జరిగిన ప్రాంతంలో లభించిన చిన్న కాగితం ముక్క ఆధారంగా వాహనం యజమానిని ట్రేస్ చేసి సంప్రదించగా, అతను తన కారును స్నేహితుడికి ఇచ్చినట్టుగా చెప్పాడు. ఈ సమాచారం ఆధారంగా మృతుడిని గుర్తించినట్లు బిన్ లాహెజ్ తెలిపారు.
తాజా వార్తలు
- తిరుపతిలో ఘనంగా P4 తొలి వార్షికోత్సవం..
- భారీ లేఆఫ్స్ లేవు..తాత్కాలిక సర్దుబాట్లకే కంపెనీల మొగ్గు!
- ఏప్రిల్ 6 నుండి ఆన్లైన్ క్లాసులు ప్రారంభించనున్న భారతీయ పాఠశాలలు!
- సముద్రగర్భ కేబుళ్లకు యుద్ధ ముప్పు..ప్రమాదంలో భారత ఇంటర్నెట్..!!
- కువైట్ విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం..!!
- 'Maarif' ద్వారా ఆన్లైన్ నమోదును ప్రారంభించిన MoEHE..!!
- కేబుల్స్ చోరీ కేసులో ముగ్గురు ప్రవాసులు అరెస్ట్..!!
- సార్ రోడ్డు ప్రమాద నిందితుడికి 9 ఏళ్ల జైలుశిక్ష ఖరారు..!!
- ఆ దేశాలకు ప్రయాణిస్తే SR30,000 జరిమానా,ట్రావెల్ వ్యాన్..!!
- యూఏఈ విద్యా సంస్థల కీలక నిర్ణయం!









