ట్రక్కుని ఢీకొట్టి.. మంటల్లో చిక్కుకుని డ్రైవర్ మృతి
- June 12, 2023
దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో ట్రక్కును ఢీకొట్టి మంటలు చెలరేగడంతో అందులో చిక్కుకొని కారు డ్రైవర్ మృతి చెందాడు. ట్రాఫిక్ రిజిస్ట్రేషన్ హెడ్, బర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ కెప్టెన్ అహ్మద్ ఖల్ఫాన్ బిన్ లాహెజ్ మాట్లాడుతూ.. వాహనదారుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డులో అక్రమంగా నిష్క్రమించడానికి ప్రయత్నించాడని తెలిపారు. అతని వాహనం అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. దాంతో కారులో మంటలు చెలరేగాయని, అందులో చిక్కుకొని డ్రైవర్ మరణించాడని పేర్కొన్నారు. డ్రైవర్ వెంటనే మృతి చెందగా, కారు పూర్తిగా ధ్వంసమైంది. కాలిపోయిన వాహనం నంబర్ ప్లేట్ నుండి పోలీసులకు కేవలం రెండు అంకెలు మాత్రమే లభించాయి.దీంతో మృతుడి గుర్తింపును నిర్ధారించడం కష్టంగా మారింది. ఘటన జరిగిన ప్రాంతంలో లభించిన చిన్న కాగితం ముక్క ఆధారంగా వాహనం యజమానిని ట్రేస్ చేసి సంప్రదించగా, అతను తన కారును స్నేహితుడికి ఇచ్చినట్టుగా చెప్పాడు. ఈ సమాచారం ఆధారంగా మృతుడిని గుర్తించినట్లు బిన్ లాహెజ్ తెలిపారు.
తాజా వార్తలు
- వలసదారుల్లో ప్రయాణ భయం…
- రేపటి నుంచి కొత్త UPI రూల్స్! తెలుసుకోండి
- ఖలీదా జియాకు కన్నీటి వీడ్కోలు…హాజరైన మంత్రి జైశంకర్
- బహ్రెయిన్ క్రిమినల్ జస్టిస్ పై యూఏఈ ఆసక్తి..!!
- రియాద్ సీజన్ 2025..11 మిలియన్ల మార్క్ రీచ్..!!
- ఆర్ యూ రెడీ.. న్యూఇయర్ వేడుకలు..ఫుల్ గైడ్..!!
- మస్కట్ కు INSV కౌండిన్య.. చారిత్రాత్మక ప్రయాణం..!!
- కువైట్ లో న్యూ ఇయర్ వేడుకలు..భద్రతా కట్టుదిట్టం..!!
- హోటల్ రూమ్స్ బుకింగ్ లో ఖతార్ రికార్డు..!!
- దుబాయ్: 'మా గల్ఫ్' న్యూస్ న్యూ ఇయర్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి కొలుసు పార్థసారథి







