పర్యాటకులకు శుభవార్త.. త్వరలో షువైఖ్ బీచ్ అభివృద్ధి ప్రాజెక్ట్
- June 14, 2023
కువైట్: షువైఖ్ బీచ్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు కువైట్ మునిసిపాలిటీ, నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ మధ్య కుదిరిన సహకార ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈరోజు జరిగిన ప్రారంభ సమావేశంలో నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్, కువైట్ మున్సిపాలిటీ మరియు అరబ్ బ్యూరో అధికారులు పాల్గొని ప్రాజెక్ట్ పురోగతిపై చర్చించారు. షువైఖ్ బీచ్ ప్రాజెక్ట్ అభివృద్ధికి నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ 3 మిలియన్ కువైట్ దినార్లను అందించింది.
షేక్ జాబర్ అల్-అహ్మద్ కల్చరల్ సెంటర్కు ఎదురుగా కువైట్ నగరంలో 1.7 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీచ్ అభివృద్ధి, సుందరీకరణ పనులు ప్రాజెక్ట్లో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కీలకమైన ప్రదేశం కారణంగా పర్యాటకం, వినోదం, క్రీడా కార్యకలాపాలకు కొత్త వాతావరణాన్ని సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రాజెక్ట్ రెండు దశల్లో అమలు చేయబడుతుంది. ఇందులో మొదటిది డిజైన్ దశ కాగా, ఐదు నెలల్లో పూర్తవుతుంది. రెండవ అమలు దశను పూర్తి చేసేందుకు 12 నెలలు పడుతుందని అధికారులు తెలిపారు.
షువైఖ్ బీచ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ 4 ప్రధాన ప్రాంతాలను కలిగి ఉంది. ఇక్కడ మొదటి ప్రాంతంలో క్రీడా కార్యకలాపాలు, వినోద ప్రదేశాలు, విశాలమైన గ్రీనరి ఉన్నాయి. రెండవ ప్రాంతంలో చెక్క బెంచీలతో విస్తరించిన ఇసుక బీచ్ ప్రాంతానికి కేటాయించారు. మూడవ ప్రాంతం ఒక పెద్ద ఆకుపచ్చ ప్రదేశాలు, చెట్లను కలిగి ఉన్న క్లోజ్డ్ గార్డెన్ కు కేటాయించారు. నాల్గవ ప్రాంతం నడక కోసం, సైకిళ్ల కోసం మార్గాలను నిర్మించనున్నారు.
తాజా వార్తలు
- 'స్మైలింగ్ బుద్ధా' అణు పరీక్షకు 52 ఏళ్లు: మల్లికార్జున ఖర్గే
- నక్సల్స్ రహిత తెలంగాణను తీర్చిదిద్దిన పోలీస్ అధికారులకు సన్మానం..!
- అత్యంత అరుదైన కిడ్నీ క్యాన్సర్ను జయించిన 8 నెలల చిన్నారి
- మహారాష్ట్ర విద్యార్థులతో ‘యువ సంగం’ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఎస్ఐబీ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ సి.వి.ఆనంద్
- కర్ణాటక దుబారే క్యాంప్లో విషాదం..
- ఢిల్లీలో మెరిసిన భారత తొలి బుల్లెట్ ట్రైన్ లుక్!
- శాంతిభద్రతల పరిరక్షణలో సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'
- యూఏఈ ప్రైవేట్ ఉద్యోగులకు ఈద్ అల్ అదా సెలవులు ప్రకటింపు
- అంకిత భావంతో ప్రజలకు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









