'బహ్రైనౌనా' జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించే వేదిక: పర్యాటక మంత్రి
- June 14, 2023
బహ్రెయిన్: జాతీయ ప్రణాళిక (బహ్రైనౌనా) పౌరసత్వ విలువలను బలోపేతం చేస్తుందని, మెజెస్టి కింగ్ నేతృత్వంలోని బహ్రెయిన్లో స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి జాతీయ వేదికగా నిలుస్తుందని పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ తెలిపారు. టూరిజం మంత్రిత్వ శాఖ, బహ్రెయిన్ టూరిజం, ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA), జాతీయ ప్రణాళిక కార్యనిర్వాహక కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. హవార్ దీవుల ప్రమోషన్, బహ్రెయిన్ క్యాలెండర్, టూరిజం యాప్ ద్వారా బహ్రెయిన్ పర్యాటక కార్యకలాపాలను ఈ సందర్భంగా సమీక్షించారు. బహ్రెయిన్ సమాజంలోని ప్రామాణికమైన విలువలు, ఆచారాలు మరియు సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అరబ్ మరియు ఇస్లామిక్ వారసత్వం, బహ్రెయిన్ జాతీయ గుర్తింపు ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో.. జాతీయ గుర్తింపు విలువలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం ప్రాముఖ్యతను అల్ సైరాఫీ ధృవీకరించారు.
తాజా వార్తలు
- యూఏఈ దాడి పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగ శాఖ
- ఇరాక్ నుంచి వచ్చిన మూడు డ్రోన్లను కూల్చివేసిన సౌదీ అరేబియా
- కె.ఎల్.రావు వర్దంతి వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు
- కేరళ నూతన ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణస్వీకారం
- ఇక నుంచి వారంలో నాలుగు రోజులే పనిదినాలు..
- అమెరికా: గాల్లో ఢీకొన్న యుద్ధ విమానాలు
- ఒమన్ లో 25 శాతం పెరిగిన కూరగాయల ధరలు..!!
- బహ్రెయిన్-కువైట్ భద్రతా సహకారం బలోపేతం..!!
- పిరికిపంద ఉగ్రవాద దాడి..ఐఏఈఏ చీఫ్ తో యూఏఈ విదేశాంగ మంత్రి..!!
- హజ్ వీసా గడువు దాటితే.. ఫైన్స్, జైలు శిక్ష, బహిష్కరణ..సౌదీ వార్నింగ్..!!









