'బహ్రైనౌనా' జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించే వేదిక: పర్యాటక మంత్రి
- June 14, 2023
బహ్రెయిన్: జాతీయ ప్రణాళిక (బహ్రైనౌనా) పౌరసత్వ విలువలను బలోపేతం చేస్తుందని, మెజెస్టి కింగ్ నేతృత్వంలోని బహ్రెయిన్లో స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి జాతీయ వేదికగా నిలుస్తుందని పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ తెలిపారు. టూరిజం మంత్రిత్వ శాఖ, బహ్రెయిన్ టూరిజం, ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA), జాతీయ ప్రణాళిక కార్యనిర్వాహక కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. హవార్ దీవుల ప్రమోషన్, బహ్రెయిన్ క్యాలెండర్, టూరిజం యాప్ ద్వారా బహ్రెయిన్ పర్యాటక కార్యకలాపాలను ఈ సందర్భంగా సమీక్షించారు. బహ్రెయిన్ సమాజంలోని ప్రామాణికమైన విలువలు, ఆచారాలు మరియు సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అరబ్ మరియు ఇస్లామిక్ వారసత్వం, బహ్రెయిన్ జాతీయ గుర్తింపు ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో.. జాతీయ గుర్తింపు విలువలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం ప్రాముఖ్యతను అల్ సైరాఫీ ధృవీకరించారు.
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









