'బహ్రైనౌనా' జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించే వేదిక: పర్యాటక మంత్రి
- June 14, 2023
బహ్రెయిన్: జాతీయ ప్రణాళిక (బహ్రైనౌనా) పౌరసత్వ విలువలను బలోపేతం చేస్తుందని, మెజెస్టి కింగ్ నేతృత్వంలోని బహ్రెయిన్లో స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి జాతీయ వేదికగా నిలుస్తుందని పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ తెలిపారు. టూరిజం మంత్రిత్వ శాఖ, బహ్రెయిన్ టూరిజం, ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA), జాతీయ ప్రణాళిక కార్యనిర్వాహక కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. హవార్ దీవుల ప్రమోషన్, బహ్రెయిన్ క్యాలెండర్, టూరిజం యాప్ ద్వారా బహ్రెయిన్ పర్యాటక కార్యకలాపాలను ఈ సందర్భంగా సమీక్షించారు. బహ్రెయిన్ సమాజంలోని ప్రామాణికమైన విలువలు, ఆచారాలు మరియు సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అరబ్ మరియు ఇస్లామిక్ వారసత్వం, బహ్రెయిన్ జాతీయ గుర్తింపు ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో.. జాతీయ గుర్తింపు విలువలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం ప్రాముఖ్యతను అల్ సైరాఫీ ధృవీకరించారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







