'బహ్రైనౌనా' జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించే వేదిక: పర్యాటక మంత్రి
- June 14, 2023
బహ్రెయిన్: జాతీయ ప్రణాళిక (బహ్రైనౌనా) పౌరసత్వ విలువలను బలోపేతం చేస్తుందని, మెజెస్టి కింగ్ నేతృత్వంలోని బహ్రెయిన్లో స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి జాతీయ వేదికగా నిలుస్తుందని పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ తెలిపారు. టూరిజం మంత్రిత్వ శాఖ, బహ్రెయిన్ టూరిజం, ఎగ్జిబిషన్స్ అథారిటీ (BTEA), జాతీయ ప్రణాళిక కార్యనిర్వాహక కార్యాలయం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. హవార్ దీవుల ప్రమోషన్, బహ్రెయిన్ క్యాలెండర్, టూరిజం యాప్ ద్వారా బహ్రెయిన్ పర్యాటక కార్యకలాపాలను ఈ సందర్భంగా సమీక్షించారు. బహ్రెయిన్ సమాజంలోని ప్రామాణికమైన విలువలు, ఆచారాలు మరియు సంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. అరబ్ మరియు ఇస్లామిక్ వారసత్వం, బహ్రెయిన్ జాతీయ గుర్తింపు ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో.. జాతీయ గుర్తింపు విలువలను ప్రోత్సహించడంలో ప్రభుత్వం, ప్రైవేట్ రంగాల మధ్య సహకారం ప్రాముఖ్యతను అల్ సైరాఫీ ధృవీకరించారు.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







