ఉద్యోగుల నకిలీ వేలిముద్రలతో హాజరు.. ముగ్గురు ప్రవాసులు అరెస్ట్
- June 15, 2023
కువైట్: ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు, ఉద్యోగుల వేలిముద్రలను ఫోర్జరీ చేసినందుకు ముగ్గురు ఈజిప్టు ప్రవాసులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం.. ఈ ప్రవాసులు ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. పనికి హాజరుకాని ఉద్యోగుల తరపున వీరు వేలిముద్ర వేస్తారు. ఈ సెక్యూరిటీ గార్డులు తమ వేలిముద్ర వేయడానికి ఆ ఉద్యోగుల నుంచి నెలకు 10 దినార్లు వసూలు చేస్తారని నివేదిక చెబుతోంది. నిందితుల నుంచి ఉద్యోగులకు సంబంధించిన 40 సిలికాన్ వేలిముద్రలను అధికారులు గుర్తించారు. సిలికాన్ వేలిముద్రను స్వాధీనం చేసుకున్న ప్రతి ఉద్యోగిని కూడా విచారణ కోసం పిలుస్తున్నామని, అనుమానితులందరినీ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపుతామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ‘ఐక్య ధైర్య సేన సమితి’ మొదలుపెట్టిన మంచు మనోజ్
- యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు 3 డ్రోన్లను అడ్డుకున్నాయి
- తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మే 20 వరకు జాగ్రత్త..
- ప్రముఖ సీనియర్ నిర్మాత కే రజన్ ఆత్మహత్య!
- ఈద్ అల్ అదా 2026 తేదీ ఖరారు చేసిన దేశాలు..
- అబుదాబి బరాకా అణు విద్యుత్ కేంద్రం వద్ద డ్రోన్ దాడి..అగ్నిప్రమాదం
- చిల్కూరు బాలాజీ ఆలయం పై అమెరికా సెనేటర్ అనుచిత వ్యాఖ్యలు
- విదేశీ నియామకాలను అధిగమించిన బహ్రెయిన్ ఉద్యోగాలు..!!
- జీసీసీ ‘వాఫెడ్’: ప్రవాస కార్మికులకు వైద్య పరీక్షలు..!!
- సౌదీలో 7రోజుల్లో 11,272 మంది నివాసితులు బహిష్కరణ..!!









