ఉద్యోగుల నకిలీ వేలిముద్రలతో హాజరు.. ముగ్గురు ప్రవాసులు అరెస్ట్
- June 15, 2023
కువైట్: ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు, ఉద్యోగుల వేలిముద్రలను ఫోర్జరీ చేసినందుకు ముగ్గురు ఈజిప్టు ప్రవాసులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం.. ఈ ప్రవాసులు ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. పనికి హాజరుకాని ఉద్యోగుల తరపున వీరు వేలిముద్ర వేస్తారు. ఈ సెక్యూరిటీ గార్డులు తమ వేలిముద్ర వేయడానికి ఆ ఉద్యోగుల నుంచి నెలకు 10 దినార్లు వసూలు చేస్తారని నివేదిక చెబుతోంది. నిందితుల నుంచి ఉద్యోగులకు సంబంధించిన 40 సిలికాన్ వేలిముద్రలను అధికారులు గుర్తించారు. సిలికాన్ వేలిముద్రను స్వాధీనం చేసుకున్న ప్రతి ఉద్యోగిని కూడా విచారణ కోసం పిలుస్తున్నామని, అనుమానితులందరినీ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపుతామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల