ఉద్యోగుల నకిలీ వేలిముద్రలతో హాజరు.. ముగ్గురు ప్రవాసులు అరెస్ట్
- June 15, 2023
కువైట్: ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు, ఉద్యోగుల వేలిముద్రలను ఫోర్జరీ చేసినందుకు ముగ్గురు ఈజిప్టు ప్రవాసులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం.. ఈ ప్రవాసులు ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. పనికి హాజరుకాని ఉద్యోగుల తరపున వీరు వేలిముద్ర వేస్తారు. ఈ సెక్యూరిటీ గార్డులు తమ వేలిముద్ర వేయడానికి ఆ ఉద్యోగుల నుంచి నెలకు 10 దినార్లు వసూలు చేస్తారని నివేదిక చెబుతోంది. నిందితుల నుంచి ఉద్యోగులకు సంబంధించిన 40 సిలికాన్ వేలిముద్రలను అధికారులు గుర్తించారు. సిలికాన్ వేలిముద్రను స్వాధీనం చేసుకున్న ప్రతి ఉద్యోగిని కూడా విచారణ కోసం పిలుస్తున్నామని, అనుమానితులందరినీ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపుతామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







