ఉద్యోగుల నకిలీ వేలిముద్రలతో హాజరు.. ముగ్గురు ప్రవాసులు అరెస్ట్
- June 15, 2023
కువైట్: ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సులు, ఉద్యోగుల వేలిముద్రలను ఫోర్జరీ చేసినందుకు ముగ్గురు ఈజిప్టు ప్రవాసులను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం.. ఈ ప్రవాసులు ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. పనికి హాజరుకాని ఉద్యోగుల తరపున వీరు వేలిముద్ర వేస్తారు. ఈ సెక్యూరిటీ గార్డులు తమ వేలిముద్ర వేయడానికి ఆ ఉద్యోగుల నుంచి నెలకు 10 దినార్లు వసూలు చేస్తారని నివేదిక చెబుతోంది. నిందితుల నుంచి ఉద్యోగులకు సంబంధించిన 40 సిలికాన్ వేలిముద్రలను అధికారులు గుర్తించారు. సిలికాన్ వేలిముద్రను స్వాధీనం చేసుకున్న ప్రతి ఉద్యోగిని కూడా విచారణ కోసం పిలుస్తున్నామని, అనుమానితులందరినీ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు పంపుతామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ
- కొత్త IT చట్టం రూల్స్
- బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్లోనే సమాధానం: వెంకయ్య నాయుడు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!









