విరూపాక్ష 2.! హింట్ ఇచ్చేసిన డైరెక్టర్.!
- June 15, 2023
సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా తెరకెక్కిన ‘విరూపాక్ష’ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.
అనూహ్యంగా భారీ వసూళ్లు కొల్లగొట్టింది ఈ సినిమా. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సీక్వెల్ రూపొందబోతోందంటూ ప్రచారం జరిగింది. కానీ, అలాంటిదేం లేదంటూ అప్పుడు కొట్టి పడేశారు తేజు అండ్ టీమ్.
కానీ, ఇప్పుడు స్వయంగా డైరెక్టర్ కార్తీక్ దండు సీక్వెల్ విషయం తెరపైకి తెచ్చారు. ఈ సినిమాకి సీక్వెల్ వుంటుందని తెలిపారు. అయితే, అందుకు సంబందించిన స్టోరీ డెవలప్మెంట్ ఇంకా జరగలేదనీ.. అందుకు చాలా టైమ్ పడుతుందనీ ఆయన తెలిపారు.
మొత్తానికి సీక్వెల్ అయితే కన్పామ్ చేశారు కానీ, ఎప్పుడూ.? ఏంటీ.? ఎలా వుండబోతోంది.? అనే వివరాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.!
తాజా వార్తలు
- దేశంలో ఎడ్యు కేషన్ సిస్టమ్ పై రాహుల్ కీలక వ్యాఖ్యలు
- ఈద్ అల్ అధా తేదీలు ప్రకటింపు
- ఏపీకి వడగాలుల హెచ్చరిక..
- ‘ఐక్య ధైర్య సేన సమితి’ మొదలుపెట్టిన మంచు మనోజ్
- యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థలు 3 డ్రోన్లను అడ్డుకున్నాయి
- తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మే 20 వరకు జాగ్రత్త..
- ప్రముఖ సీనియర్ నిర్మాత కే రజన్ ఆత్మహత్య!
- ఈద్ అల్ అదా 2026 తేదీ ఖరారు చేసిన దేశాలు..
- అబుదాబి బరాకా అణు విద్యుత్ కేంద్రం వద్ద డ్రోన్ దాడి..అగ్నిప్రమాదం
- చిల్కూరు బాలాజీ ఆలయం పై అమెరికా సెనేటర్ అనుచిత వ్యాఖ్యలు









