భవిష్యత్తు యుద్ధాలను దృష్టిలో పెట్టుకుని వైమానిక దళం ముందుకు సాగుతుంది: రాష్ట్రపతి
- June 17, 2023
హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రెండు రోజుల పర్యటన కొసం తెలంగాణకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె దుండిగల్లో జరిగిన ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పరేడ్లో పాల్గొన్నారు. రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారతీయ వైమానిక దళం అన్ని శాఖల్లోనూ మహిళా ఆఫీసర్లను రిక్రూట్ చేయడం సంతోషకరమన్నారు. మహిళా ఫైటర్ పైలెట్ల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరగనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏప్రిల్లో తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్లో విహరించినట్లు ఆమె తెలిపారు. దాదాపు 30 నిమిషాల పాటు ఆ జెట్లో బ్రహ్మపుత్రి, తేజ్పూర్ లోయల్లో విహరించానని, హిమాలయాల అద్భుతాలను వీక్షించినట్లు ఆమె తెలిపారు. సముద్ర మట్టానికి రెండు కిలోమీటర్ల ఎత్తులో దాదాపు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ఎగరడం గొప్ప అనుభూతిని మిగిల్చినట్లు ముర్ము తెలిపారు. భవిష్యత్తు యుద్ధాలను దృష్టిలో పెట్టుకుని వైమానిక దళం ముందుకు సాగుతున్నట్లు ఆమె తెలిపారు.
కాగా, బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. ఇకపోతే, పరేడ్కి రివ్యూయింగ్ అధికారిగా రాష్ట్రపతి వ్యవహరించడం ఎయిర్ ఫోర్స్ అకాడమీ చరిత్రలో ఇది మొదటి సారి. రాష్ట్రపతి ముర్ముతోపాటే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ సీఎస్ శాంత కుమారి హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- ఫిలిప్పీన్స్లోని బొంగావోలో అర్ధరాత్రి మంటలు: 1,000 కి పైగా ఇళ్లు దగ్ధం
- భారతీయ ఉపాధ్యాయురాలిని అత్యుత్తమ పురస్కారంతో సత్కరించిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్..
- DPDP గడువు కుదింపుతో భారత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థకు సవాళ్లు
- ఇది సభ సంప్రదాయం కాదు: స్పీకర్ ఓం బిర్లా
- ఐఐటీ హైదరాబాద్లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు
- అక్రమ మద్యం రహిత రాష్ట్రంగా ఘనత సాధించిన ఏపీ: మంత్రి రవీంద్ర
- జర్నలిస్టుల కుటుంబాలకు అండగా మీడియా అకాడమీ..రూ.లక్ష ఆర్థిక సహాయం
- బొగ్గు గనిలో పేలుడు 10 మంది మృతి మేఘాలయలో విషాదం!
- సైబర్ మోసాలకు చెక్.. వింగో యాప్ క్లోజ్!
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!







