90% మంది విద్యార్థులలో పాఠశాల స్థాయిలోనే కెరీర్ ఆలోచనలు
- June 17, 2023
యూఏఈ: హైస్కూల్ విద్యార్థులు (15- నుండి 18 సంవత్సరాల వయస్సు గలవారు) ఇప్పటికే వారి వృత్తిపరమైన ఆకాంక్షలపై దృష్టి సారించారు. దాదాపు 40% మంది వ్యాపారం మరియు ఆరోగ్య సంరక్షణలో వెళ్లాలని యోచిస్తున్నారు. విద్యార్థుల కెరీర్ ఆకాంక్షలు, భవిష్యత్తుపై విడుదల చేసిన KPMG-GEMS విద్యా నివేదికలో ఈమేరకు తెలిపారు. "మైండ్ ది గ్యాప్" పేరుతో వెలువడిన నివేదిక యూఏఈలోని 800 కంటే ఎక్కువ మంది ఉన్నత పాఠశాల విద్యార్థులను వారి కెరీర్ లక్ష్యాలు, ప్రభావాలు, అడ్డంకుల గురించి సర్వే చేసింది. యూఏఈ ప్రభుత్వం యువతను తన గొప్ప ఆస్తిగా చూస్తోందని నివేదిక పేర్కొంది. విద్యార్థులు కమ్యూనికేషన్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటీ మరియు ఇన్నోవేషన్, సోషల్ స్కిల్స్ మరియు లీడర్షిప్ హై మార్కులను వారు భవిష్యత్ ఉద్యోగ విజయానికి అత్యంత ముఖ్యమైనవిగా భావించిన నైపుణ్యాలుగా చెప్పారు. చాలా మంది సాంకేతికత, సమాచారం మరియు మీడియా అక్షరాస్యతను తమ భవిష్యత్తు విజయానికి కీలకంగా పరిగణించలేదు.
రాష్ట్ర ఉన్నత విద్య, అధునాతన నైపుణ్యాల మంత్రి సలహాదారు డాక్టర్ ఫైసల్ అల్ హమ్మదీ.. GEMS ఎడ్యుకేషన్లో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డినో వర్కీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎమిలియో పెరా సమక్షంలో GEMS మోడ్రన్ అకాడమీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నివేదికను ఆవిష్కరించారు.
బిజినెస్ టాప్ ఛాయిస్: నివేదిక ప్రకారం.. చాలా మంది విద్యార్థులు వ్యాపారాన్ని (21%), ఆ తర్వాత హెల్త్కేర్ (20%), ఇంజినీరింగ్ (12%), క్రియేటివ్ ఆర్ట్స్ 6%) కొనసాగించాలని యోచిస్తున్నారు. మగ విద్యార్థులకు (29%) వ్యాపారం అగ్ర ఎంపికకాగా, మహిళా విద్యార్థులలో (24%) ఆరోగ్య సంరక్షణకు ఓటు వేసారు. 1% కంటే తక్కువ మంది కంప్యూటర్ సైన్స్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అధ్యయనం చేయాలని ప్లాన్ చేసారు. కేవలం 5% మంది మాత్రమే సహజ శాస్త్రాలను అధ్యయనం చేయాలని కోరుకుంటున్నారు. 4% మహిళా విద్యార్థులు, 14% మంది మగ విద్యార్థులు ITలోకి వెళ్లాలని యోచిస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







