రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్
- June 17, 2023
కువైట్: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ (IDF) కువైట్ కాచ్ సహకారంతో అహ్మదీలోని అల్ అదాన్ బ్లడ్ బ్యాంక్లో సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరం జూన్ 16వ తేదీన జరిగింది. ఈ శిబిరాన్ని కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ముస్తఫా రెడా, IDF అధ్యక్షుడు డాక్టర్ దివాకర చలువయ్య, క్యాచ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆశిష్ జైన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ చేపట్టిన ఈ చొరవను డాక్టర్ ముస్తఫా రెడా అభినందించారు. రక్తదాన శిబిరానికి పెద్ద సంఖ్యలో వైద్యులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై రక్తదానం చేశారు.
ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ అనేది 2004 నుండి కువైట్లోని భారతీయ వైద్యుల ప్రధాన సామాజిక-సాంస్కృతిక సంస్థ. వివిధ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేస్తున్న 600 మందికి పైగా వైద్యులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో క్షిపణి దాడి.. భారత నావికుడి మృతిపై యూఏఈలోని భారత రాయబార కార్యాలయం సంతాపం
- కాళేశ్వరం వివాదం పై కేటీఆర్ ఫైర్..
- ఏపీ విద్యార్థులకు అలర్ట్..
- సూసైడ్ నోట్లో 4 పేర్లు.. కేసులో సంచలన మలుపు!
- జోర్డాన్ గగనతలంలోకి చొరబడిన నాలుగు ఇరానియన్ క్షిపణులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..
- మిడిలీస్టు ఉద్రిక్తతలతో చమురు ధరలు పెరుగుదల..గోల్డ్ ధరలు తగ్గుదల..!!
- ఖతార్ లో కార్మిక మంత్రిత్వ శాఖ ఈ-సేవలు కొనసాగింపు..!!







