రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్
- June 17, 2023
కువైట్: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ (IDF) కువైట్ కాచ్ సహకారంతో అహ్మదీలోని అల్ అదాన్ బ్లడ్ బ్యాంక్లో సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరం జూన్ 16వ తేదీన జరిగింది. ఈ శిబిరాన్ని కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ముస్తఫా రెడా, IDF అధ్యక్షుడు డాక్టర్ దివాకర చలువయ్య, క్యాచ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆశిష్ జైన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ చేపట్టిన ఈ చొరవను డాక్టర్ ముస్తఫా రెడా అభినందించారు. రక్తదాన శిబిరానికి పెద్ద సంఖ్యలో వైద్యులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై రక్తదానం చేశారు.
ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ అనేది 2004 నుండి కువైట్లోని భారతీయ వైద్యుల ప్రధాన సామాజిక-సాంస్కృతిక సంస్థ. వివిధ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేస్తున్న 600 మందికి పైగా వైద్యులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









