రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్
- June 17, 2023
కువైట్: ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ (IDF) కువైట్ కాచ్ సహకారంతో అహ్మదీలోని అల్ అదాన్ బ్లడ్ బ్యాంక్లో సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరం జూన్ 16వ తేదీన జరిగింది. ఈ శిబిరాన్ని కువైట్లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా ప్రారంభించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ముస్తఫా రెడా, IDF అధ్యక్షుడు డాక్టర్ దివాకర చలువయ్య, క్యాచ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆశిష్ జైన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ చేపట్టిన ఈ చొరవను డాక్టర్ ముస్తఫా రెడా అభినందించారు. రక్తదాన శిబిరానికి పెద్ద సంఖ్యలో వైద్యులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై రక్తదానం చేశారు.
ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ అనేది 2004 నుండి కువైట్లోని భారతీయ వైద్యుల ప్రధాన సామాజిక-సాంస్కృతిక సంస్థ. వివిధ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ప్రైవేట్ ఆసుపత్రులలో పనిచేస్తున్న 600 మందికి పైగా వైద్యులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
తాజా వార్తలు
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం







