ఈ ఏడాది ఇరాన్వాసులకు హజ్యాత్ర లేనట్లే!
- May 13, 2016
ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్రలో పాల్గొనడాన్ని ఈ ఏడాది నిలిపేసినట్లు ఇరాన్ వెల్లడించింది. సౌదీ అరేబియాలోని మక్కాను ముస్లింలు తమ జీవితకాలంలో ఒకసారైనా సందర్శించుకోవాలని ఆశిస్తారు. ఈ యాత్రకు ఏటా దేశదేశాల నుంచి లక్షలాది మంది హాజరవుతారు. అయితే ఇరాన్, సౌదీ అరేబియా దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న కారణంగా ఇరాన్ తమ దేశం నుంచి హజ్ యాత్రను నిలిపేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత ఏడాది హజ్ యాత్రలో ప్రమాదం జరిగి 2వేల మంది యాత్రికులు మృత్యువాతపడ్డారు. వారిలో 464 మంది ఇరాన్ వాసులు ఉన్నారు. దీంతో సౌదీలో లక్షలాది హజ్ యాత్రికుల భద్రతకు సంబంధించి ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది.ఇరాన్ వాసులకు హజ్యాత్ర కోసం అనుమతులు, రవాణా, వీసాలకు సంబంధించి సౌదీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఈ ఏడాది ఇరాన్వాసులకు హజ్యాత్ర ఉండదని ఇరాన్ సాంస్కృతిక శాఖ మంత్రి అలీ జన్నతి మీడియాకు వెల్లడించారు. తాము చేయగలిగిందంతా చేశామని, సౌదీ నుంచి సానుకూల స్పందన రాలేదని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







