కువైట్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- June 22, 2023
కువైట్: కువైట్లోని భారత రాయబార కార్యాలయం జూన్ 21న ఎంబసీ ప్రాంగణంలో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమానికి యోగా ప్రియులు భారీగా హాజరయ్యారు. వివిధ దేశాల రాయబారులు, కువైట్లోని UN మిషన్ హెడ్లు, ఇతర దౌత్యవేత్తలు హాజరయ్యారు. యోగాను ప్రారంభించిన సందర్భంగా భారత రాయబారి మాట్లాడుతూ.. యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం కాదని, ఇది మన శరీరం, మనస్సు, ఆత్మను శ్రావ్యంగా ఉంచే సంపూర్ణ జీవన విధానమన్నారు. ఇది క్రమమైన అభ్యాసం ద్వారా అంతర్గత శాంతిని అందిస్తుందని, యోగాను ఉపయోగించి వ్యక్తి తమ జీవితాన్ని మార్చుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని వసుదైవ కుటుంబం అనే థీమ్తో నిర్వహించారు. "వారాంతాల్లో ఎంబసీలో ఉచిత యోగా క్లాస్తో సహా వివిధ మార్గాల ద్వారా కువైట్లో ఎంబసీ యోగాను ప్రాచుర్యం పొందుతోంది. ఈ శిక్షణకు హాజరు కావడానికి మీ అందరికీ స్వాగతం." అని రాయబారి తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను చేర్చుకోవాలని ఆయన ప్రోత్సహించారు.

తాజా వార్తలు
- ఏఐ ప్రభావం షాకింగ్, ఉద్యోగాలకు భారీ ముప్పు?
- Bangladesh: తారిక్ రెహమాన్ ప్రధాని కావడం భారత్కు ప్రయోజనమా?
- బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రముఖ రియల్టీ సంస్థ అన్విత గ్రూప్
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM









