మనామా సెంట్రల్ మార్కెట్లో తగ్గిన వ్యాపారం..!
- June 22, 2023
బహ్రెయిన్: మనామా సెంట్రల్ మార్కెట్లో గత కొన్ని రోజులుగా కస్టమర్లు రావడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. అదే సమయంలో మిగిలిపోయిన పండ్లు, కూరగాయల విక్రయాలు జరుపుతున్నారని వినియోగదారులు చెబుతున్నారు. దీంతో సూపర్ మార్కెట్లకు వెళుతున్నట్లు పేర్కొంటున్నారు. మార్కెట్ను సకాలంలో డా శుభ్రం చేయకపోవడం వల్ల ఉత్పత్తుల తాజాదనాన్ని వినియోగదారులు అనుమానిస్తున్నారని విక్రేతలు వాపోతున్నారు. దీనిపై ఇప్పటికే అనేక కథనాలు వచ్చినా.. అధికారులు చర్యలు చేపట్టడం లేదని మార్కెట్ లోని వ్యాపారులు వాపోతున్నారు. సాధారణ కస్టమర్ అయిన మహ్మద్ డానిష్ మాట్లాడుతూ, "నేను మరియు నా కుటుంబం ప్రతి శుక్రవారం ఉదయం కూరగాయలు కొనడానికి సెంట్రల్ మార్కెట్కి వెళ్తాము, కాని వారు మిగిలిపోయిన వాటిని అమ్మడం ప్రారంభించినందున నేను ఆపివేసాను. ఈ విక్రేతలు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి, రోజుల తరబడి నిల్వ చేసి, ఆపై వాటిని విక్రయిస్తారు. పేలవమైన పారిశుధ్యం, ఎలుకల ఉనికి, ఈ ప్రాంతంలో దుర్వాసన మరియు వేడి వేసవి కాలంలో పనికిరాని ఎయిర్ కండిషనింగ్ కూడా సెంట్రల్ మార్కెట్ను ఎంచుకోకుండా వినియోగదారులను నిరోధిస్తున్నాయి.’’ అని ఆయన తెలిపారు. ఎలుకల బెడద, పరిశుభ్రత లోపించడం వల్ల చాలా నష్టపోతున్నామని సెంట్రల్ మార్కెట్లో విక్రయదారుడు అష్కర్ అన్నారు. "మార్కెట్ ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు మూసివేయబడుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకు తెరుచుకుంటుంది. ఆ సమయంలో ఎలుకలు స్వైరవిహార చేస్తాయి. పండ్లు, కూరగాయల బస్తాలలో చేరి నాశనం చేస్తున్నాయి. " అని ఆయన వివరించారు. మార్కెట్ను క్రమ పద్ధతిలో శుభ్రపరిచే కార్యక్రమాలు కాలక్రమేణా బలహీనపడ్డాయని అష్కర్ చెప్పారు. ఈ విషయంలో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంతకుముందు మార్కెట్లో వారానికి రెండు సార్లు క్లీనింగ్ కార్యకలాపాలు నిర్వహించేవారమని.. ఇప్పుడు వారానికోసారి మాత్రమే చేస్తున్నామని, అధికారులు తక్షణమే మార్కెట్ను శుభ్రం చేసేందుకు చర్యలు చేపట్టాలని వ్యాపారులు కోరారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







