కార్మికులకు జీతాలు చెల్లించని కంపెనీకి Dh1.075 మిలియన్ జరిమానా
- June 25, 2023
దుబాయ్: కార్మికుల జీతాలు చెల్లించడంలో విఫలమైనందుకు దుబాయ్లో ఉన్న నిర్మాణ సంస్థ యజమానికి 1.075 మిలియన్ దిర్హామ్లు జరిమానా విధించినట్లు ఎమిరేట్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.దుబాయ్ నేచురలైజేషన్ మరియు రెసిడెన్సీ ప్రాసిక్యూషన్ కంపెనీ డైరెక్టర్ను కోర్టు విచారించింది. కార్మికుల వేతనాలు చెల్లించకపోవడంపై అతనిపై అభియోగాలు మోపింది. సంస్థలోని 215 మంది కార్మికులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని నిజం అని తేలింది. కంపెనీలో ఆర్థిక సవాళ్ల కారణంగా తమ సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని నిందితులు అంగీకరించారని అధికార వర్గాలు తెలిపాయి. కేసును విచారించిన తర్వాత కోర్టు ప్రతి కార్మికునికి Dh5,000 జరిమానా(మొత్తం Dh1.075-మిలియన్ పెనాల్టీ) చెల్లించాలని కంపెనీ యజమానిని ఆదేశించింది.
తాజా వార్తలు
- ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..
- గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక
- చిన్నారుల మృతి ఘటనలపై ఏపీ ప్రభుత్వం సీరియస్
- ప్రపంచంలోనే తొలి స్పేస్ డెలివరీ వెహికల్
- ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్న తెలంగాణ యువతి
- మలేషియా ప్రభుత్వం ప్రారంభించిన మైగ్రెంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0
- కరీంనగర్ లో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథ సంచాలన్...
- శ్రీవారి భక్తులకు బిగ్ అలెర్ట్..
- బహ్రెయిన్ లో ఘనంగా బతుకమ్మ, దసరా సంబరాలు
- విశాఖలో విషాదం..బీచ్లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు..