కార్మికులకు జీతాలు చెల్లించని కంపెనీకి Dh1.075 మిలియన్ జరిమానా

- June 25, 2023 , by Maagulf
కార్మికులకు జీతాలు చెల్లించని కంపెనీకి Dh1.075 మిలియన్ జరిమానా

దుబాయ్: కార్మికుల జీతాలు చెల్లించడంలో విఫలమైనందుకు దుబాయ్‌లో ఉన్న నిర్మాణ సంస్థ యజమానికి 1.075 మిలియన్ దిర్హామ్‌లు జరిమానా విధించినట్లు ఎమిరేట్స్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.దుబాయ్ నేచురలైజేషన్ మరియు రెసిడెన్సీ ప్రాసిక్యూషన్ కంపెనీ డైరెక్టర్‌ను కోర్టు విచారించింది. కార్మికుల వేతనాలు చెల్లించకపోవడంపై అతనిపై అభియోగాలు మోపింది. సంస్థలోని 215 మంది కార్మికులకు రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని నిజం అని తేలింది. కంపెనీలో ఆర్థిక సవాళ్ల కారణంగా తమ సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోతున్నామని నిందితులు అంగీకరించారని అధికార వర్గాలు తెలిపాయి. కేసును విచారించిన తర్వాత కోర్టు ప్రతి కార్మికునికి Dh5,000 జరిమానా(మొత్తం Dh1.075-మిలియన్ పెనాల్టీ) చెల్లించాలని కంపెనీ యజమానిని ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com