ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..

- October 05, 2025 , by Maagulf
ఐసీసీ మహిళల ప్రపంచ కప్: పాక్ ని చిత్తు చిత్తుగా ఓడించిన భారత్..

ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా భారత్‌, పాకిస్థాన్‌ తలపడ్డాయి. పాక్ ను భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది. 88 పరుగుల తేడాతో పాక్ ను మట్టి కరిపించింది భారత్. 248 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పాక్.. 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సిద్రా ఆమిన్ (81) పోరాటం చేసినా మరో ఎండ్ లో సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెలరేగారు. తలో మూడు వికెట్లు తీశారు. స్నేహ్ రానా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో భారత్ కు ఇది రెండో విజయం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com