సముద్రపు అడుగుభాగం నుండి టైటాన్ శిథిలాల వెలికితీత
- June 29, 2023
యూఏఈ: సముద్రపు అడుగుభాగం నుండి టైటాన్ శిథిలాలను వెలికితీశారు. గతవారం ఓషన్గేట్ టైటానిక్ యాత్ర సబ్మెర్సిబుల్ విషాదం జరిగిన విషయం తెలిసిందే. అందులో ప్రయాణించిన ఐదుగురు సాహసికులు మరణించారు. కెనడాలోని న్యూఫౌండ్ల్యాండ్లోని సెయింట్ జాన్స్లోని కెనడియన్ కోస్ట్ గార్డ్ పీర్ వద్ద ఉన్న హారిజన్ ఆర్కిటిక్ షిప్ నుండి టైటాన్ సబ్కి చెందిన కొన్ని మాంగల్డ్ శిధిలాలను చేరవేశారు.
కెనడియన్ జెండాతో కూడిన హారిజన్ ఆర్కిటిక్ రిమోట్గా పనిచేసే వాహనం లేదా ROVని తీసుకువెళ్లింది. ఇది న్యూఫౌండ్ల్యాండ్కు దక్షిణంగా 700 కిలోమీటర్లు (435 మైళ్లు) దూరంలో ఉన్న టైటానిక్ శిధిలాల నుండి సముద్రపు అడుగుభాగాన్ని శోధించింది. ROV యజమానులు, US-ఆధారిత పెలాజిక్ రీసెర్చ్ సర్వీసెస్, దాని బృందం ఆఫ్షోర్ కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసిందని ధృవీకరించారు. 10 రోజులపాటు పనిచేసిన తర్వాత హారిజోన్ ఆర్కిటిక్ నుండి దాని పరికరాలను తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నౌకాశ్రయం శిథిలాలను దించుతున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
టైటాన్ జూన్ 18న సముద్రపు ఉపరితలం నుండి దాదాపు 4కి.మీ (సుమారు 2.4 మైళ్ళు) దిగువన ఉన్న టైటానిక్ సైట్కు వెళ్లే సమయంలో సముద్రపు ఒత్తిడిని తట్టుకోలేక పేలుడు జరిగి అందులో ఉన్న 5 మంది చనిపోయారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









