జెడ్డాలోని యుఎస్ కాన్సులేట్పై దాడి.. కాల్పుల్లో ముష్కరుడు మృతి
- June 29, 2023
జెడ్డా: బుధవారం జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ భవనంపై ఓ సాయుధ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అనంతరం చోటుచేసుకున్నఎదురుకాల్పుల తర్వాత దుండగుడు మరణించాడని అధికారిక ప్రతినిధి తెలిపారు. ఎదురుకాల్పుల సందర్భంగా కాన్సులేట్ సెక్యూరిటీ గార్డుల్లో నేపాలీ కార్మికుడు తీవ్రంగా గాయపడి మరణించాడు. ప్రమాదం పరిస్థితులను నిర్ధారించడానికి భద్రతా పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని మక్కా పోలీసు ప్రతినిధి తెలిపారు. “బుధవారం సాయంత్రం 6:45 గంటలకు జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ భవనం దగ్గర కారులో వచ్చిన ఒక వ్యక్తి, కారును ఆపి చేతిలో తుపాకీని పట్టుకుని బయటకు వచ్చాడు. భద్రతా అధికారుల హెచ్చరికలను పెడచెవిన పెట్టిన అతను కాల్పులకు తెగబడ్డాడు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి సదరు సాయుధుడి మట్టుబెట్టాయి.’’ అని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది
- సిక్కింలో సొరంగం నుంచి వెలికితీసిన 22 మృతదేహాలు..
- విదేశాల్లో ఉద్యోగాల పేరుతో రూ.13 కోట్ల బిగ్ జాబ్ స్కామ్
- నగరాభివృద్ధి పనులపై సీఎం రేవంత్ సమీక్ష
- అమెరత్–బౌషర్ మౌంటేన్ రోడ్ రెండు రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో MoHRE ఫీజులు, ఫైన్స్ ఈఎంఐల్లో చెల్లించే అవకాశం..!!
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!







