జెడ్డాలోని యుఎస్ కాన్సులేట్పై దాడి.. కాల్పుల్లో ముష్కరుడు మృతి
- June 29, 2023
జెడ్డా: బుధవారం జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ భవనంపై ఓ సాయుధ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. అనంతరం చోటుచేసుకున్నఎదురుకాల్పుల తర్వాత దుండగుడు మరణించాడని అధికారిక ప్రతినిధి తెలిపారు. ఎదురుకాల్పుల సందర్భంగా కాన్సులేట్ సెక్యూరిటీ గార్డుల్లో నేపాలీ కార్మికుడు తీవ్రంగా గాయపడి మరణించాడు. ప్రమాదం పరిస్థితులను నిర్ధారించడానికి భద్రతా పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయని మక్కా పోలీసు ప్రతినిధి తెలిపారు. “బుధవారం సాయంత్రం 6:45 గంటలకు జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ భవనం దగ్గర కారులో వచ్చిన ఒక వ్యక్తి, కారును ఆపి చేతిలో తుపాకీని పట్టుకుని బయటకు వచ్చాడు. భద్రతా అధికారుల హెచ్చరికలను పెడచెవిన పెట్టిన అతను కాల్పులకు తెగబడ్డాడు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి సదరు సాయుధుడి మట్టుబెట్టాయి.’’ అని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!









