ఎస్ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం..!
- July 02, 2023
హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ చైర్మన్గా రాజమౌళి బాధ్యతలు చేపట్టారు. సినిమా రంగంలోకి ప్రవేశించకముందు మంచి క్రికెటర్ గా ఉన్న రాజమౌళి... ఇప్పటికీ తీరిక దొరికనప్పుడల్లా సరదాగా క్రికెట్ ఆడుతుంటారు. తాజాగా గ్రామీణ ప్రాంతంలోని క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాజమౌళి తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. తాము క్రికెట్ ఆడే సమయంలో టీమ్ మొత్తానికి ఒకటే బ్యాట్ ఉండేదన్నారు. అది కూడా ఇప్పుడు ఉపయోగించే బ్రాండెడ్ బ్యాటులాంటిది కాదని... సాధారణ చెక్క బ్యాట్ ఆడేవాళ్లమన్నారు. ఇక మహేంద్ర సింగ్ ధోనీకి తాను చాలా పెద్ద అభిమానిని అని చెప్పారు. అతడి సారథ్యంలో భారత్ జట్టు టీ20, వన్డే వరల్డ్క్పలు సాధించినప్పుడు తన సంతోషానికి అవధులు లేవన్నారు. మరింత మంది ధోనీలు రావాలనేదే తన ఆకాంక్ష అన్నారు. ప్రతిభ ఉన్నా సరైన సదుపాయాలు, దిశా నిర్దేశం చేసేవారు లేక ఎంతో మంది క్రికెటర్లు వెలుగులోకి రాకుండానే వారి కెరీర్ ముగిసిపోయిందన్నారు. గ్రామీన ప్రాంతాల్లోని క్రికెట్ నైపుణ్యాలను ప్రదర్శించడానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!