తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు
- July 05, 2023
హైదరాబాద్: తెలంగాణలో 8 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రానున్నాయి. జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కాలేజీల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త కాలేజీలు వస్తే ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. దీని ద్వారా దేశంలోనే అరుదైన రికార్డ్ సొంతం చేసుకోనుంది. 9ఏళ్లలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రాగా రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10వేలకు చేరువ కానున్నాయి.
”జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అన్న సీఎం కేసీఆర్ లక్ష్యం సాకారం కానుంది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. మొత్తం 34 మెడికల్ కాలేజీలతో దేశంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకోనుంది తెలంగాణ. ఈ తొమ్మిదేళ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు 10వేలకు చేరువ కానున్నాయి. మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువయ్యాయి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది. సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు” అని మంత్రి హరీశ్ అన్నారు.
తాజా వార్తలు
- సినీ నటి ప్రత్యూష మృతి కేసు..సుప్రీంకోర్టు కీలక తీర్పు..
- భారత్ లోనే కాస్ట్లీ ఎయిర్పోర్ట్గా హైదరాబాద్..
- మహిళను చంపిన పూజారికి శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు
- లైసెన్స్ లేకుండా సేవలందిస్తే..SR2,600 ఫైన్..!!
- విడాకుల కేసులు పెరగడంపై షురా కౌన్సిల్ ఆందోళన..!!
- అలెర్ట్..ఉమ్ అల్ హౌల్ ఇంటర్చేంజ్లో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఆన్లైన్ బెగ్గింగ్ మోసాలపై దుబాయ్ పోలీసుల వార్న్..!!
- రమదాన్..ధరల పర్యవేక్షణకు ముమ్మర తనిఖీలు..!!
- కింగ్ ఫైసల్ రోడ్డులో రెండు లేన్లు మార్చి 29 వరకు మూసివేత..!!
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!









