ఖతార్ లో 72 శాతం పెరిగిన సందర్శకులు
- July 06, 2023
దోహా: మే 2023లో 285,000 మంది సందర్శకులు వార్షిక ప్రాతిపదికన 72 శాతం వృద్ధిని కనబర్చడంతో ఖతార్ సందర్శకుల రాకలో వృద్ధిని సాధించింది. ఈ మేరకు ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ అథారిటీ (PSA) విడుదల చేసిన తాజా నివేదిక స్పష్టం చేసింది. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) దేశాల నుండి వచ్చిన సందర్శకులు మే నెలలో పర్యాటకుల రాకపోకలలో బలమైన వృద్ధికి గణనీయంగా దోహదపడ్డారని, జిసిసి దేశాలు మొత్తం రాకపోకలలో 37 శాతం మంది ఉన్నారని పేర్కొన్నారు. నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం మేలో మొత్తం సందర్శకులలో 29 శాతం మంది ఆసియా దేశాల (ఓషియానియాతో సహా) నుండి వచ్చారు. ఇతర యూరోపియన్, అరబ్ దేశాల నుండి వచ్చే యాత్రికులు మొత్తం సందర్శకుల రాకపోకలలో వరుసగా 17 శాతం మరియు 9 శాతం ఉన్నారు. ప్రముఖ ఆకర్షణలు, ఈవెంట్ల నిరంతర షెడ్యూల్తో ఖతార్ ఒక ప్రధాన అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా ఆకట్టుకుంటోందని నివేదిక తెలపింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







